Union Finance Minister Nirmala Sitharaman is once again a rare honour

ఆర్థిక మంత్రికి మరోసారి అరుదైన గౌరవం

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో చోటు సాధించారు. ఫోర్బ్స్‌ ఏటా వ్యాపారం, వినోదం, రాజకీయ, దాతృత్వం తదితర రంగాల నుంచి ప్రభావవంతమైన వ్యక్తుల ర్యాంకింగ్‌లను విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌ నుంచి మొత్తం ముగ్గురికి చోటు దక్కింది. అందులో నిర్మలమ్మ తొలి స్థానంలో నిలిచారు. ఇక వరుసగా ఆరో సంవత్సరం ఈ జాబితాలో ఆమె చోటు దక్కించుకోవడం విశేషం.

Advertisements

శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్‌ తొలిసారి 2019లో చోటు దక్కించుకున్నారు. ఆ ఏడాది ఆమెకు 34వ ర్యాంక్‌ దక్కింది. 2020లో 41వ స్థానం, 2021లో 37వ స్థానం సాధించిన ఆమె 2022లో 36వ స్థానం, 2023లో 32వ స్థానంలోనిలిచారు. ఇప్పుడు 28వ స్థానంలో చోటు దక్కించుకోవడం విశేషం. ఏటా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు. ఇక నిర్మలమ్మ తర్వాత ఈ జాబితాలో ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్‌పర్సన్‌, హెచ్‌సీఎల్‌ కార్పొరేషన్‌ సీఈవో అయిన రోష్ని నాడార్‌ మల్హోత్రా 81వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా 82వ స్థానంలో ఉన్నారు.

Related Posts
జీహెచ్ఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం
జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం

హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మరియు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలపై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 91-ఏ Read more

Dilsukhnagar blasts case : దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్ష
Dilsukhnagar bomb blast case.. Accused sentenced to death

Dilsukhnagarblasts case : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్ సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు Read more

Akbaruddin : విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యం : అక్బరుద్దీన్ ఆగ్రహం
Akbaruddin విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యం అక్బరుద్దీన్ ఆగ్రహం

Akbaruddin : విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నిర్లక్ష్యం : అక్బరుద్దీన్ ఆగ్రహం తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో అమలైన "మన ఊరు - మన బడి" కార్యక్రమంపై Read more

TG10th Results: తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?
TG10th Results: తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ రాష్ట్రంలోని పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలు 2025 మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు Read more

Advertisements
×