Ukraine takes first step towards mineral deal with US

Ukraine : అమెరికాతో ఖనిజాల ఒప్పందం పై తొలి అడుగు : ఉక్రెయిన్‌

Ukraine : రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించేందుకు తాము చొరవ తీసుకుంటామని, ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి తమను అనుమతించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఇరుదేశాల ఒప్పందానికి తొలి అడుగు పడినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. ఇందులోభాగంగా కీవ్‌, వాషింగ్టన్ మెమోరాండంపై సంతకం చేశాయని ఉక్రెయిన్‌ ఆర్థికమంత్రి యులియా స్విరిడెంకో వెల్లడించారు.

Advertisements
అమెరికాతో ఖనిజాల ఒప్పందం పై తొలి

కీలకమైన ఖనిజాలను పొందడానికి మార్గం సుగమం అవుతుంది

మా అమెరికన్ భాగస్వాములతో మెమోరాండం ఆఫ్ ఇంటెంట్‌పై సంతకం చేసినట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నాం. ఈ ఒప్పందం ఇరుదేశాల ఆర్థిక భాగస్వామ్యం, దేశ పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, వ్యాపారాలలో మద్దతు, కొత్త ఆర్థిక అవకాశాల సృష్టికి పెట్టుబడులు వంటి వాటికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాం అని యులియా స్విరిడెంకో సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈవిషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధ్రువీకరించారు. ఈ ఒప్పదం ద్వారా అగ్రరాజ్యం ఉక్రెయిన్ నుంచి సహజ వనరులు, కీలకమైన ఖనిజాలను పొందడానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.

తమకు ఖనిజాలు లభిస్తే.. ఆ దేశానికి అవసరమైన వాటిని అందిస్తాం

గతంలో ఈ ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు తాము 500 బిలియన్‌ డాలర్ల డీల్‌ను ప్రతిపాదించామన్నారు. దానికి జెలెన్‌స్కీ సైతం అంగీకరించారని తెలిపారు. తమకు ఖనిజాలు లభిస్తే.. ఆ దేశానికి అవసరమైన వాటిని అందిస్తామన్నారు. మరోవైపు.. ‘వాషింగ్టన్ ఇచ్చింది 100 బిలియన్‌ డాలర్లయితే.. 500 బిలియన్‌ డాలర్లకు ఒప్పందం అడగకూడదు’ అంటూ జెలెన్‌స్కీ కౌంటర్‌ ఇచ్చారు. ఈక్రమంలో తాజాగా ఉక్రెయిన్‌ ట్రంప్‌ డీల్‌పై సంతకాలు చేయడం గమనార్హం.

Read Also: భగవద్గీత, నాట్య శాస్త్రానికి యునెస్కో గుర్తింపు

Related Posts
డ్రోన్ టెక్నాలజీ..ఫ్యూచర్ గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు
Salary of Rs 2 lakh per month for cabinet rank holders - AP Govt

అమరావతి : మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహించిన 'అమరావతి డ్రోన్‌ సమ్మిట్‌' ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సంక్షోభ సమయంలో Read more

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2024!
world aids day

ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎయిడ్స్‌ వ్యాధి గురించి అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించబడుతుంది. ఈ రోజు ఎయిడ్స్ మరియు Read more

Mallikarjun Kharge : సర్దార్ పటేల్ పేరు వెనుక రాజకీయం చేస్తే సరిపోదు: ఖర్గే ఫైర్
Mallikarjun Kharge సర్దార్ పటేల్ పేరు వెనుక రాజకీయం చేస్తే సరిపోదు ఖర్గే ఫైర్

స్వాతంత్ర్యం కోసం పోరాడని వారు ఇప్పుడు themselves as సర్దార్ పటేల్ వారసులు అంటూ ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు Read more

తెలంగాణ రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: ఈటెల
Government should support Telangana farmers.. Etela Rajender

రైతాంగాన్ని ఆదుకోవాలి.. లేదంటే తీవ్ర పరిణామాలు వరంగల్‌: బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్‌ వరంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూసేకరణతో రైతులు తీవ్రంగా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×