కేంద్రంపై విరుచుకుపడిన ఉదయనిధి స్టాలిన్

కేంద్రంపై విరుచుకుపడిన ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రజలు బీజేపీ బెదిరింపులకు భయపడరని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ హెచ్చరించారు. రాష్ట్రంలో విద్య, రెండు భాషల విధానం ముప్పులో ఉన్నాయన్నారు. “మనం హిందీని అంగీకరించాలని వారు దృఢంగా ఉన్నారు. వారు తమిళనాడు చరిత్ర, సంస్కృతి, ప్రత్యేక గుర్తింపును నాశనం చేయాలనుకుంటున్నారు. ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం తమిళనులను రెండో తరగతి పౌరులుగా మార్చాలని కోరుకుంటోంది” అని ఉదయనిధి పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో ప్రత్యర్థి పార్టీ అయిన ఏఐఏడీఎంకేను కూడా తమతో చేతులు కలిపి రాష్ట్ర ద్విభాషా విధానం కోసం పోరాడాలని కోరారు. రాజకీయ లాభం కోసం దీనిని ఉపయోగించకుండా తమతో చేరి గొంతును పెంచాలని ఏఐఏడీఎంకేను కోరుతున్నామన్నారు.

కేంద్రంపై విరుచుకుపడిన ఉదయనిధి స్టాలిన్


విద్యా నిధులను నిలిపివేశారు
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతృత్వంపై కేంద్ర సర్కారు విద్యా నిధులను నిలిపివేసి రాష్ట్రంపై హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తమిళనాడు ద్విభాషా విధానం కోసం పోరాటంలో పాల్గొనాలని ఆయన పలు పార్టీలను కూడా కోరారు. సమగ్ర శిక్షా అభియాన్ నిధిలో తమిళనాడు తన వాటాను న్యాయబద్ధంగా డిమాండ్ చేస్తోందన్నారు. తమిళనాడుకు న్యాయబద్ధంగా విడుదల చేయాల్సిన రూ.2,190 కోట్ల కోసం రాష్ట్రం యాచించడం లేదని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. “మేము మీ అబ్బ సొమ్మేం అడగడం లేదు. తమిళనాడు విద్యార్థుల తల్లిదండ్రులు పన్ను రూపంలో చెల్లించిన మా హక్కును మేం అడుగుతున్నాం. మాకు చెందిన నిధిని మేము అడుగుతున్నాం.” అని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అన్నారు.

డీఎంకే నిరసనలు
కొత్త విద్యా విధానం, త్రిభాషా వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి చెన్నైలో డీఎంకే నిరసన చేపట్టింది. ఈ నిరసనలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ నిరసనలో పాల్గన్నారు. తమిళనాడు ప్రజలు త్రిభాషా భాషా విధానాన్ని ఎప్పటికీ అంగీకరించరని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల మాట్లాడుతూ.. తమిళనాడు త్రిభాషా విధానాన్ని అంగీకరిస్తేనే నిధులు అందిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ విద్యా విధానాన్ని పూర్తిగా అమలు చేయకపోతే రాష్ట్రానికి నిధులను విడుదల చేయదని అన్నారు.

Related Posts
Parliament Budget : బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లుపై చర్చ
Parliament Budget బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లుపై చర్చ

Parliament Budget : బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లుపై చర్చ గురువారం (మార్చి 20, 2025) ఉదయం పార్లమెంట్ లో కాసేపు గందరగోళం చెలరేగింది. లోక్‌సభ, రాజ్యసభ Read more

జమ్మూ లో కాంగ్రెస్ ..హర్యానా లో బిజెపి విజయం
jK haryana results

కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లారు హర్యానా ప్రజలు..జమ్మూ & హర్యానా లో కాంగ్రెస్ విజయం కహాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పడం తో కాంగ్రెస్ శ్రేణులు ఉదయమే Read more

ఆలయ కూల్చివేత ఆర్డర్‌కు రుజువు: అతిషి
ఆలయ కూల్చివేత ఆర్డర్‌కు రుజువు: అతిషి

దేశ రాజధానిలో దేవాలయాలు, ఇతర మతపరమైన కట్టడాలను కూల్చివేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశించారని ఆమె చేసిన ఆరోపణలకు తన వద్ద “డాక్యుమెంటరీ ఆధారాలు” ఉన్నాయని Read more

US Tariffs: ట్రంప్ టారిఫ్స్ తో సంక్షోభంలో భారత ఆర్థిక వృద్ధి
ట్రంప్ టారిఫ్స్ తో సంక్షోభంలో భారత ఆర్థిక వృద్ధి

ప్రపంచ ఆర్థిక, రాజకీయ రంగాలు ప్రస్తుతం చాలా సంక్లిష్టంగా మారాయి. గత కొన్ని దశాబ్దాలుగా గ్లోబల్ పొలిటిక్స్, ఎకనామిక్స్, బిజినెస్ రిలేషన్స్ ఒక నిర్దిష్ట పద్ధతిని కొనసాగించాయి. Read more