రంజాన్ సందర్భంగా యూఏఈ క్షమాభిక్షలు.. 500 మంది భారతీయ ఖైదీలకు ఊరట

UAE: రంజాన్ సందర్భంగా యూఏఈ క్షమాభిక్షలు.. 500 మంది భారతీయ ఖైదీలకు ఊరట

ముస్లిం ప్రజల అతిపెద్ద పండగు అయిన రంజాన్ సందర్బంగా యూఏఈ అధ్యక్షుడు పెద్ద ఎత్తున క్షమాభిక్షలు ప్రకటించారు. ఎవరూ ఊహించని విధంగా 2813 మందికి క్షమాభిక్షలు మంజూరు చేయగా.. అందులో 1295 మందిని విడుదల చేయబోతున్నారు. అలాగే 1518 మందికి శిక్షను తగ్గించనున్నారు. అయితే విడుదల అయిన ఖైదీల్లో 500 మందికి పైగా భారతీయులు ఉండగా.. వారితో పాటు వారి కుటుంబాలు సహా తెగ సంబుర పడిపోతున్నాయి.
పెద్ద ఎత్తున క్షమాభిక్షలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే పెద్ద ఎత్తున క్షమాభిక్షలు ప్రసాదించారు. అయితే నెల రోజులు కూడా గడవక ముందే మరోసారి పెద్ద ఎత్తున క్షమాభిక్షలు ప్రసాదించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ముఖ్యంగా వారెంతో పవిత్ర మాసంగా భావించే ఈనెల.. రంజాన్ పండుగకు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 1295 మంది ఖైదీలను విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీని తర్వాతే అధ్యక్షుడు 1295 మందిని విడుదల చేయాలని చెప్పారు. అయితే ఇందులో 500 మందికి పైగా భారతీయులు ఉన్నారు. దీంతో విడుదల అయిన వాళ్లు, క్షమాభిక్షలు పొందిన వాళ్లు సహా వారి కుటుంబ సభ్యులంతా తెగ సంబుర పడిపోతున్నారు.

Advertisements
Related Posts
United States: నిధుల సంక్షోభం కారణంగా మయన్మార్‌లో ఆహార సహాయం తగ్గింపు
నిధుల సంక్షోభం కారణంగా మయన్మార్‌లో ఆహార సహాయం తగ్గింపు

ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) మయన్మార్‌లో పది లక్షల మందికి పైగా ప్రజలకు ఆహార సహాయం నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని శుక్రవారం ప్రకటించింది. నిధుల కొరత "క్లిష్టమైన" Read more

PM Modi : ప్రధాని మోడీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం
Sri Lanka highest award for Prime Minister Modi

PM Modi : భారతదేశం, శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, ఉమ్మడి సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఆయన చేసిన అసాధారణ ప్రయత్నాలకు గుర్తింపుగా శ్రీలంక Read more

ఈ అరాచకం మనం సృష్టించుకున్నదే: బంగ్లా ఆర్మీ చీఫ్
ఈ అరాచకం మనం సృష్టించుకున్నదే: బంగ్లా ఆర్మీ చీఫ్

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో.. దేశం మొత్తం సర్వనాశనమైన తర్వాత బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌కి తత్వం బోధపడినట్టుంది. ఇప్పుడేమో దేశం ప్రమాదంలో ఉందని, Read more

నోబెల్‌ శాంతి పురస్కారానికి ఎలాన్‌ మస్క్‌ నామినేట్‌
elon musk

ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సర్కార్‌ కొత్తగా ఏర్పాటు చేసిన ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్న్‌మెంట్‌ ఎఫిషియెన్సీ’(డోజ్‌) విభాగం అధిపతి ఎలాన్‌ మస్క్‌ ప్రతిష్టాత్మక Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×