Two judges who took oath in AP High Court

ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణం..

అమరావతి : ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ , డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన జడ్జిలను పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందించారు.

image

రాష్ట్ర హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 28 మంది పనిచేస్తున్నారు. ఇద్దరి నియమకంతో ఆ సంఖ్య 30కు చేరుకోంది. మరో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా , ఆతరువాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. ప్రకాశం జిల్లాకు చెందిన జస్టిస్‌ డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు , కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిగా హరిహరనాథ శర్మ పలు కోర్టుల్లో వివిధ సేవలను అందించారు.

కాగా, రాష్ట్ర హైకోర్టుకు ఇద్దరు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. అదనపు న్యాయమూర్తులుగా న్యాయాధికారులు అవధానం హరిహరనాథశర్మ, డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో వారిని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. కొత్త న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts
మహారాష్ట్రలో దూసుకుపోతున్న ఎన్డీయే కూటమి
Maharashtra assembly polls results

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అధికార పార్టీ ఆధిక్యంలో ఎన్డీయే కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ 145 స్థానాలను దాటిన మహాయుతి.. ప్రస్తుతం Read more

వెండితెరకు హరికృష్ణ మనవడు పరిచయం
nandamuri taraka ramarao

నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావును ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. న్యూ టాలెంట్ రోల్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ Read more

నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం
Vaikunta Mahadwaram

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. గత పది రోజులుగా భక్తుల తాకిడితో తిరుమలలో విశేషమైన రద్దీ నెలకొంది. టీటీడీ (తిరుమల Read more

ఉత్తరప్రదేశ్ లో మసీదు సర్వే వివాదం: ఘర్షణల్లో 3 మరణాలు, 20 మంది పోలీసులకు గాయాలు
up incident

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సమ్భాల్ జిల్లాలో ఆదివారం ఒక మసీదు సర్వేతో వివాదం జరిగింది. ఈ హింసాత్మక ఘర్షణల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరియు 20 మంది పోలీసు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *