అంబానీ పెళ్లికి వెళ్లిన ఇద్దరు ఏపీ యువకులపై కేసు..

ప్రపంచ కుబేరుడు ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో అట్టహాసంగా శుక్రవారం జరిగిన సంగతి తెలిసిందే. దేశ విదేశాల నుంచి ఎందరో అతిరథ మహారథులు వీరి పెళ్లికి హాజరై దీవెనలు అందించారు. జియో వరల్డ్‌ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో అనంత్‌ అంబానీ.. ఫార్మా దిగ్గజం వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధికా మర్చంట్‌ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.

ఈరోజు తో ఈ పెళ్లి వేడుకలు పూర్తి అయ్యాయి. అయితే ఈ పెళ్లికి వెళ్లిన ఇద్దరు ఏపీ వ్యక్తులపై కేసు నమోదు అయ్యింది. అల్లూరి వెంకటేశ్ అనే యూట్యూబర్ తో పాటు మరో యువకుడి పేరు షఫీ షేక్ లకు పెళ్లి ఆహ్వానం లేకపోయినా వెళ్లడం తో పోలీసులు కేసు నమోదు చేసారు. వారిద్దరిపై వేర్వేరుగా కేసులు నమోదు చేసుకున్న ముంబయి బీకేసీ పోలీసులు… ఆ ఏపీ యువకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, నోటీసులు ఇచ్చి వదిలేశారు.