రెండేళ్ల క్రితం టర్కీలో భూకంపం సంభవించినప్పుడు.. ఆపరేషన్ దోస్త్ (operation dost)అంటూ భారత్ ఆపన్న హస్తం అందించింది. 12 గంటల్లోనే రెస్క్యూ ప్రారంభించింది. మన ఎయిర్ఫోర్స్ను, ఎన్డీఆర్ఎఫ్ బలగాలను, డాక్టర్లను, ఔషధాలను పంపించి టర్కీకి అన్ని విధాలుగా అండగా నిలిచింది. పాకిస్థాన్కు టర్కీ మిత్రదేశం అని తెలిసినా.. భారత్ సాయం అందించడానికి వెనుకడుగు వేయలేదు.
వసుధైక కుటుంబం అనేది భారత్ ఆలోచనా విధానం. మనుషులంతా ఒక్కటే.. ప్రపంచం మొత్తం ఒకటే కుటుంబం అనేది భారత్ అనాదిగా నమ్ముతూ వస్తోంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఎలాంటి ప్రమాదం తలెత్తినా.. ఏ దేశం ఆపదలో ఉన్నా.. వెంటనే ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలు వెంటనే రెస్క్యూ కోసం గాల్లోకి ఎగురుతాయి.

Turky : భారత్ సహాయం మరచిన టర్కీ.. పాక్ చేతికి డ్రోన్లు..!
భారత్ మానవత్వంతో స్పందించింది
2023లో సిరియా, టర్కీ దేశాలు భూకంపంతో వణికిపోయినప్పుడు కూడా భారత్ మానవత్వంతో స్పందించింది. ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ వేదికలపై టర్కీ పాకిస్థాన్కు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ.. పాకిస్థాన్తో ఇస్తాంబుల్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుందనే విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ.. భారత్ సాయం చేయడానికి వెనుకడుగు వేయలేదు. శత్రు దేశానికి మిత్రుడంటే.. మనకు శత్రువు కదా అనే ఆలోచన రానీయకుండా.. ఆదుకోవడానికి రంగంలోకి దిగింది. ఆపరేష్ దోస్త్.. అంటూ స్నేహ హస్తం చాచింది.
2023 ఫిబ్రవరిలో.. టర్కీలో భూకంపం వచ్చిందని తెలియగానే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. 12 గంటలలోపే సహాయక చర్యలు ప్రారంభించింది. C-17 విమానాల ద్వారా 250 మందికి పైగా సిబ్బంది, 135 టన్నుల పైగా సహాయక సామగ్రిని టర్కీకి పంపింది.
Read Also : Pakistan-India: డ్రోన్ దాడులకు తగిన బుద్ధి