TTD: వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం!

TTD: వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం!

తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం అందుతోంది. వేసవి సెలవులు నేపథ్యం లో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. దీంతో, టీటీడీ దర్శన వేళల్లో మార్పులు చేసింది. బ్రేక్ దర్శన సమయాలను నేటి నుంచి ప్రయోగాత్మకంగా మార్పు చేసి అమలు చేస్తున్నారు. అదే సమయంలో ఏ కోటా దర్శనం ఎప్పుడో టీటీడీ స్పష్టత ఇచ్చింది. సామాన్య భక్తులకు మరో గంట దర్శన సమయం పెరిగింది.

Advertisements

బ్రేక్‌ దర్శనాలు

తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనాల మార్పు ఈ రోజు (గురువారం) నుంచి అమల్లోకి రానుంది. గతంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ఉదయం 5.30 గంటలకు మొదలై ఉదయం 11 గంటలకు ముగిసేవి. అయితే రాత్రి వేళల్లో కంపార్టుమెంట్లలో వేచి ఉండే భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో గతంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను ఉదయం 10 గంటలకు మార్చారు. అయినప్పటికీ జనరల్‌ బ్రేక్‌ దర్శన భక్తులకు మాత్రం ఉదయం 8 గంటల నుంచి 10 గంటలోపు దర్శనం చేయిస్తున్నారు. ఇక, రెండవ నైవేద్యం గంట అంటే ఉదయం 10 గంటల తర్వాత ప్రొటోకాల్‌, రెఫరల్‌, శ్రీవాణి, ఉద్యోగులకు దర్శనం చేయిస్తున్నారు. దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ బ్రేక్‌ దర్శనాలు నడుస్తున్నాయి.క్యూ లైన్లలో ఉన్న భక్తులకు మేలు చేసే విధంగా ధర్మకర్తల మండలి తిరిగి బ్రేక్‌ దర్శనాల్లో పూర్వపు విధానాన్ని అమలుచేయాలని తీర్మానించింది. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి తిరిగి పాత పద్ధతిలో బ్రేక్‌ దర్శనాలను ప్రవేశపెట్టేందుకు టీటీడీ సిద్ధమైంది. ప్రొటోకాల్‌, రిఫరెల్‌, జనరల్‌ బ్రేక్‌ దర్శనాలను ఉదయం 7.30 గంటల లోపు పూర్తి చేసి తర్వాత వీలైనంత మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించి తిరిగి 10.15 గంటల నుంచి 11.30 గంటలలోపు శ్రీవాణి, టీటీడీ ప్రస్తుత, రిటైర్డ్‌ ఉద్యోగులకు దర్శనం కల్పించేలా అధికారులు ప్రణాళికలు అమలు చేస్తు న్నారు. ఇక సిఫారసు లేఖలపై బ్రేక్‌ దర్శనాలనూ నేటి నుంచి రద్దు చేసిన క్రమంలో ఉదయం గంట, మధ్యాహ్నం గంటన్నర అదనంగా సామాన్య భక్తులకు దర్శన సమయం లభించనుంది.

 TTD: వేసవి రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం

ఉద్యోగులను

టీటీడీ తీసుకున్న నిర్ణయం మేరకు ఉదయం 5.45: ప్రొటోకాల్‌ దర్శనం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత ఉదయం 6.30: రిఫరెల్‌ ప్రొటోకాల్‌ కు అనుమతిస్తారు. ఇక, ఉదయం 6.45: జనరల్‌ బ్రేక్‌ దర్శనం మొదలు అవుతోంది. ఉదయం 10.15: శ్రీవాణి (ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌) దర్శనాలు ప్రారంభించనున్నారు. 10.30: దాతలు, ఆ తరువాత ఉదయం 11.00: టీటీడీ రిటైర్డ్‌ ఉద్యోగులను దర్శనాలకు అనుమతిస్తారు. కాగా, గురు, శుక్రవారాల్లో ఉదయం 8 గంటలకు బ్రేక్‌ దర్శనాలు ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.

Read Also: Mohan Babu : మోహన్ బాబు విచారణకు హాజరుకావాల్సిందే – సుప్రీంకోర్టు

Related Posts
అమెరిక పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేశ్‌
Minister Nara Lokesh who went on a visit to America

శాన్‌ఫ్రాన్సిస్కో : ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్నారు. ఈ సదర్భంగా అక్కడ Read more

Kurnool district Kodumur : ఎస్సీ హాస్టల్ లో దారుణం 6వ తరగతి విద్యార్థులను ? Video..
ఎస్సీ హాస్టల్ లో దారుణం 6వ తరగతి విద్యార్థులను ? వీడియో..

AP: కర్నూలు (డి) లోని కోడుమూరు ఎస్సీ హాస్టల్‌లో దారుణం జరిగింది. తాను చెప్పినది వినలేదని తొమ్మిదో తరగతి విద్యార్థి ఆరో తరగతి విద్యార్థిని బెల్టుతో కొట్టాడు. Read more

Excise CI: ఆఫీస్‌ బాయ్‌పై చెప్పుతో దాడి చేసిన ఎక్సైజ్‌ సీఐ
Excise CI: ఆఫీస్‌ బాయ్‌పై చెప్పుతో దాడి చేసిన ఎక్సైజ్‌ సీఐ

ఎక్సైజ్‌ సీఐ హసీనాభాను దుశ్శాసనం – అవినీతి వెలుగు లోకి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్‌ కార్యాలయంలో నడుస్తున్న అక్రమాలు తాజాగా వెలుగు చూశాయి. సీఐ హసీనాభాను Read more

చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేస్తాం: CM చంద్రబాబు
cbn 0chit

ఆంధ్రప్రదేశ్‌లోని సాయిసాధన చిట్ ఫండ్ బాధితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇటీవల ఆయన సచివాలయం నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా, Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×