TTD: అన్యమత ఉద్యోగస్థులపై టీటీడీ వేటు

TTD: అన్యమత ఉద్యోగస్థులపై టీటీడీ వేటు

ఆంధ్రప్రదేశ్ లోని (టీటీడీ) తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పరిధిలో అన్యమతస్తులు పనిచేయకుండా తొలగిస్తామని గతంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన అమల్లోకి వచ్చింది. ఈ మేరకు టీటీడీ పరిధిలో ఉన్న సంస్థల్లో పనిచేస్తున్న అన్యమతస్తుల్ని తొలగించే ప్రక్రియను టీడీడీ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ ఓ విద్యాసంస్ధలో ప్రిన్సిపాల్ స్ధాయిలో పనిచేస్తున్న ఉద్యోగిని బదిలీ చేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది.పూర్తీ వివరాలు మీకోసం.

Advertisements

బదిలీ

తిరుమల వెంకన్నకు ఉన్న పవిత్రతను దృష్టిలో ఉంచుకుని టీడీడీ పరిధిలో అన్యమత ఉద్యోగులు లేకుండా చూస్తామని గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో టీటీడీ ఆ మేరకు తమ పరిధిలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగుల్ని బదిలీలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న జి.అసుంతను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ అసుంతను నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీచేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఈవో ఆదేశాలు జారీ చేశారు. క్రైస్తవ మత సంప్రదాయాలు పాటిస్తూ పూజ చేయకుండా, హారతి ఇవ్వకుండా, తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా ఉన్నదని, ఆమె పై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఆమెను డిప్యూటేషన్ పై నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ చేస్తున్నట్లు టీటీడీ ఈవో ఉత్తర్వులు ఇచ్చారు. ఆమెపై ల్యాబ్ పరికరాల మాయం సహా ఇతర ఆరోపణలు కూడా ఉన్నట్లు టీటీడీ తెలిపింది.

  TTD: అన్యమత ఉద్యోగస్థులపై  టీటీడీ వేటు

అన్యమత

టీటీడీలో అన్యమత ఉద్యోగుల్ని తొలగించాలని ఎప్పటి నుంచో భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ మంది అన్యమత ఉద్యోగుల్ని టీడీడీలో నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వీరి తొలగింపుకు ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. తాజాగా బీజేపీతో కలిసి అధకారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఈ మేరకు అన్యమత ఉద్యోగుల తొలగింపుకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు టీటీడీ వాటిని అమల్లోకి తెచ్చింది.గతంలో 18 మంది ఉద్యోగుల పై టీటీడీ వేటు వేసింది.చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని టిటిడి బోర్డు గతంలో హిందూ ఉద్యోగులు మాత్రమే టిటిడిలో పనిచేయాలని పేర్కొంది.తిరుమల హిందూ విశ్వాసం పవిత్రతకు చిహ్నంగా ఉండేలా చూసుకోవడానికి తన నిబద్ధతను నాయుడు ఇంతకుముందు నొక్కిచెప్పారు. 1989 ఎండోమెంట్ చట్టం ప్రకారం, టీటీడీ ఉద్యోగులు హిందూ ఆచారాలకు కట్టుబడి ఉండాలి టీటీడీ పవిత్రతను భక్తుల మనోభావాలను ప్రభావితం చేసే అంశంపై బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది.

Read Also: Visakhapatnam : కూటమి ఖాతాలో మరో మేయర్ పీఠం

Related Posts
Farooq: ఏపీ మంత్రి ఫరూక్ సతీమణి కన్నుమూత
ఏపీ మంత్రి ఫరూక్ సతీమణి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఇంట విషాదం ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన Read more

పార్టీని వీడే ప్రసక్తి లేదని ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్సీ
Pandula Ravindra Babu

అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి వైసీపీ కీలక నేతలు పార్టీని వీడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత రాజీనామాల పర్వం ఎక్కువైంది. మాజీ Read more

నేడు అమిత్ షా, నిర్మలతో సీఎం చంద్రబాబు భేటీ
amith sha cbn

ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న ప్రధాని మోదీతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఈరోజు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. వరద నష్టం, నిధుల విడుదలపై హోంమంత్రి అమిత్ షా Read more

Kavitha : పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు: కవిత
Pawan became Deputy CM unexpectedly.. Kavitha

Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అనుకోకుండా డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యాడని… సెటైర్లు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×