నేడు సీఎం చంద్రబాబుతో టీటీడీ అధికారుల భేటీ

టీటీడీ అధికారులు ఈరోజు సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు సీఎంకు నివేదిక ఇవ్వనున్నారు. ఆగమ సలహా మండలి సూచనలను ఆయనకు వివరించనున్నారు. రిపోర్ట్ అందిన తర్వాత ఈ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడకం అంశంపై సీఎంకు టీటీడీ ఈవో శ్యామలరావు నివేదిక ఇచ్చారు. ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు.