టీటీడీ కీలక నిర్ణయాలు.. శాశ్వత ఉద్యోగులకు ప్రత్యేక దర్శనం!

TTD : టీటీడీ కీలక నిర్ణయాలు.. శాశ్వత ఉద్యోగులకు ప్రత్యేక దర్శనం!

TTD : టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఈవో శ్యామలరావుతో కలిసి టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు ఆయన బోర్డు తీర్మానాలను వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని బీఆర్‌ నాయుడు తెలిపారు. సుపథం టికెట్ ఇచ్చి శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుమలలో లైసెన్స్‌ లేని దుకాణాలను ఖాళీ చేయిస్తామని తెలిపారు.

Advertisements
టీటీడీ కీలక నిర్ణయాలు.. శాశ్వత ఉద్యోగులకు ప్రత్యేక దర్శనం!

టీటీడీ బోర్డు చేసిన ముఖ్య తీర్మానాలు ఇవే..

  1. అంతర్జాతీయ ఆలయాల నిర్మాణం: ఇతర దేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణాల కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు.
  2. ఆస్తుల పరిరక్షణ: టీటీడీ ఆస్తులను రక్షించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు.
  3. న్యాయపరమైన వివాదాలు: టీటీడీ భూముల న్యాయపరమైన వివాదాల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు.
  4. హిందూయేతర ఉద్యోగుల తొలగింపు: టీటీడీ లో విధులు నిర్వహిస్తున్న హిందూయేతర ఉద్యోగుల తొలగింపుపై తీర్మానం.
  5. రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు: వచ్చే ఏడాది కాలంలో వివిధ రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు.
  6. గ్రామాల ఆలయాలకు ఆర్థిక సాయం: అర్ధాంతరంగా ఆగిపోయిన గ్రామాల ఆలయాల నిర్మాణాలకు ఆర్థిక సహాయం.
  7. అక్రమాల విచారణ: శ్రీనివాస సేవా సమితి పేరుతో కైంకర్యాల సరఫరాలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం.
  8. పునరుద్ధరణ: టీటీడీ మూలాలున్న ప్రాంతాల్లోని ఆలయాల పునరుద్ధరణకు తీర్మానం.
  9. అనధికార హాకర్ల తొలగింపు: తిరుమలలో అనధికార హాకర్ల తొలగింపునకు విజిలెన్స్, రెవెన్యూ అధికారులతో కమిటీ ఏర్పాటు.
  10. వృద్ధులు, దివ్యాంగులకు దర్శనం: వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్‌లైన్‌లో దర్శన టికెట్లు కేటాయిస్తూ, పూర్వ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయం.
  11. టీటీడీ బడ్జెట్: రూ.5,258.68 కోట్లతో 2025-26 బడ్జెట్‌కు ఆమోదం.
  12. గదుల ఆధునీకరణ: రూ.772 కోట్లతో తిరుమల గదుల ఆధునీకరణకు నిర్ణయం. కాగా, టీటీడీ బోర్డు తీసుకున్న ఈ కీలక నిర్ణయాలు భక్తులకు మరింత సౌకర్యాన్ని అందించనున్నాయి.
Related Posts
రాష్ట్ర పండుగగా ‘సదర్’: ప్రభుత్వం జీవో జారీ
Sadar as state festival of telangana govt issued go

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం యాదవ్‌ సోదరులకు శుభవార్త తెలిపింది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో యాదవులు ఎంతో ఘనంగా నిర్వహించే సదర్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. Read more

అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది అంటే నారాయణ క్లారిటీ
అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది అంటే నారాయణ క్లారిటీ

అమరావతి రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కొత్త రాజధాని అమరావతి నిర్మాణం కోసం చాలా రోజులుగా ఆశలు, అనుమానాలు ఉన్నా, ఇప్పుడు అక్కడి అభివృద్ధి గురించి Read more

జగన్ కేసులపై విచారణ వాయిదా
అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం

మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసుల్లో సీబీఐ, ఈడీలు తన పరిశోధన వివరాలను నిన్న కోర్టులో ఫైల్ Read more

ఆయుష్మాన్ భారత్‌ ద్వారా క్యాన్సర్ చికిత్స
నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: ఆయుష్మాన్ భారత్‌ ద్వారా క్యాన్సర్ చికిత్స

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day) జరుపుకుంటారు. ఈ రోజును యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) ప్రారంభించింది. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×