తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ, వేసవి సెలవుల నేపథ్యంతో వారాంతాల్లో తిరుమలకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) భక్తుల బాగోగులకు అనుగుణంగా, దర్శన సమయాల్లో కొన్ని కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా బ్రేక్ దర్శనాల వ్యవస్థలో పాత విధానాన్ని పునరుద్ధరించింది, దీనివల్ల సామాన్య భక్తులకు మరింత ఎక్కువ సమయం కల్పించనున్నట్లు స్పష్టం చేసింది.

మార్పుల పునఃప్రారంభం
గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 5:30 గంటలకు ప్రారంభమై ఉదయం 11:00 గంటల వరకూ కొనసాగేవి. అయితే కొంతకాలం క్రితం ఈ సమయాలను ఉదయం 10:00 గంటలకు కుదించారు, దీని వల్ల కంపార్ట్మెంట్స్ లో వేచి ఉన్న భక్తులకు ఆలస్యంగా దర్శనం కలిగేది. దీనివల్ల భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో, ధర్మకర్తల మండలి ప్రత్యేకంగా సమావేశమై పాత విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రొటోకాల్, రిఫరెల్, జనరల్ బ్రేక్ దర్శనాలను ఉదయం 7.30 గంటల లోపు పూర్తి చేసి తర్వాత వీలైనంత మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించి తిరిగి 10.15 గంటల నుంచి 11.30 గంటలలోపు శ్రీవాణి, టీటీడీ ప్రస్తుత, రిటైర్డ్ ఉద్యోగులకు దర్శనం కల్పించేలా అధికారులు ప్రణాళికలు అమలు చేస్తు న్నారు. ఇక సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలనూ నేటి నుంచి రద్దు చేసిన క్రమంలో ఉదయం గంట, మధ్యాహ్నం గంటన్నర అదనంగా సామాన్య భక్తులకు దర్శన సమయం లభించనుంది.
సామాన్య భక్తులకు అదనపు సమయం –
టీటీడీ తీసుకున్న నిర్ణయం మేరకు ఉదయం 5.45: ప్రొటోకాల్ దర్శనం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత ఉదయం 6.30: రిఫరెల్ ప్రొటోకాల్ కు అనుమతిస్తారు. ఇక, ఉదయం 6.45: జనరల్ బ్రేక్ దర్శనం మొదలు అవుతోంది. ఉదయం 10.15: శ్రీవాణి (ఆన్లైన్, ఆఫ్లైన్) దర్శనాలు ప్రారంభించనున్నారు. 10.30: దాతలు, ఆ తరువాత ఉదయం 11.00: టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులను దర్శనాలకు అనుమతిస్తారు. కాగా, గురు, శుక్రవారాల్లో ఉదయం 8 గంటలకు బ్రేక్ దర్శనాలు ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మార్పులు గురువారం (నేటి నుండి) నుంచే అమలులోకి వచ్చినట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో ఉదయం 8 గంటల నుంచే బ్రేక్ దర్శనాలు ప్రారంభమవుతాయి. సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను నేటి నుంచి పూర్తిగా రద్దు చేయడంతో, సామాన్య భక్తులకు మరింత సమయం లభిస్తుంది. ఉదయం ఒక గంట, మధ్యాహ్నం గంటన్నర అదనంగా భక్తులు స్వామివారి దర్శనం పొందే అవకాశం కలుగుతుంది.
Read also: Chandrababu : MSME పార్కులను ప్రారంభించనున్న సీఎం