TTD-has-decided-to-build-temples-of-Lord-Venkateswara-in-all-the-state-capitals-of-the-country

అన్ని రాష్ట్రాల రాజధానుల్లో స్వామి ఆలయాలు: టీటీడీ

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల వేంకటేశ్వరుడి ప్రాముఖ్యతను మరింతగా పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ ఆలయాలు ఏర్పాటు చేయాలని నిర్మయించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో సమావేశమైన టీటీడీ మండలి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయాలలు, ఆస్తులను మరింత విస్తరించాలని చంద్రబాబు సూచించారు. ఆయన సూచనల మేరకు నిపుణుల కమిటీ వేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారు. అదే టైంలో చంద్రబాబు సూచించినట్టు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి పాలకమండలి ఆమోదం తెలిపింది.

తిరుమల వచ్చే భక్తుల సౌకర్యాలపై కూడా టీటీడీ దృష్టి పెట్టింది. వచ్చే భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొనే చర్యలకు శ్రీకారం చుట్టింది. దీని కోసం ఫీడ్‌బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ హెల్ప్ తీసుకొని ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. తిరుమలలో ఉన్న బిగ్‌, జనతా క్యాంటీన్‌లలో ఫుడ్ సరిగా లేదని చాలా ఫిర్యాదులు వస్తున్నట్టు ప్రకటించింది. ఇక్కడ మరింత మంచి ఫుడ్ అందించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ క్యాంటీన్లను ఆహ్వానించేందుకు కొత్త విధానం తీసుకురానున్నారు. తిరుమలలో ఆహార పదార్థాలను తనిఖీ కోసం ప్రత్యేకంగా ఫుడ్ సెఫ్టి డిపార్టమెంట్‌ ఏర్పాటు చేయాలని నిర్మయించారు. దీనికి సీనియర్ ఫుడ్ సేఫ్టి ఆఫీస‌ర్‌ పోస్టును SLSMPC కార్పొరేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

Related Posts
ప్రియాంకా గాంధీ తరఫున సీతక్క ప్రచారం
sithakka priyanka

కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత, తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క ప్రస్తుతం కేరళలోని వయనాడ్‌లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రియాంకా గాంధీ తరఫున ఆమె వయనాడ్ లోని Read more

కుల గణన చిచ్చు..రేవంత్ సర్కార్ పై.. బీసీ సంఘాల ఫైర్!
కుల గణన చిచ్చు రేవంత్ సర్కార్ పై.. బీసీ సంఘాల ఫైర్!

2014లో జరిగిన సమగ్ర సర్వేలో OC (ఆప్తి కేటగిరీ) జనాభా 11% ఉండగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో ఆ సంఖ్య 15.79%కి పెరిగింది.ఇదే సమయంలో Read more

నేడు నాంపల్లి కోర్టు ముందు హాజరుకానున్న నాగార్జున
Defamation suit against Konda Surekha. Nagarjuna to appear in court tomorrow

నేడు నాంపల్లి కోర్టు ముందు హాజరుకానున్న నాగార్జున హాజరుకాబోతున్నారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ నాగార్జున తో పాటు ఆయన మాజీ కోడలు పై చేసిన వ్యాఖ్యలకు Read more

US సాయం నిలిపివేత… భారత్ పై ప్రభావం ఎంతంటే.?
usaid bharath

అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో USAID (United States Agency for International Development) ద్వారా అనేక దేశాలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. భారత్‌కు కూడా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *