TTD gears up for ‘Vaikunta Dwara Darshan from January 10 to 19

జనవరి 10 నుంచి 19 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమల: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సోమవారం అధికారులతో సమీక్షించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో వివిధ విభాగాల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి కావడంతో ఆ రోజు నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులకు కల్పించనున్నారు. ఈ పదిరోజుల పాటు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు (స్వయంగా వచ్చే ప్రొటోకాల్‌ ప్రముఖులకు మినహా) చేసినట్టు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అలాగే, చంటిబిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, డిఫెన్స్‌, ఎన్‌ఆర్‌ఐ దర్శనాలతో పాటు ఆర్జితసేవలు రద్దు చేస్తున్నట్టు చెప్పారు.

వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదాల వితరణ చేయాలని అధికారులకు సూచించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోటా, ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో ఇంకోసారి సమీక్షిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్‌వో శ్రీధర్, సీఈ సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరోవైపు వైకుంఠ ఏకాదశికి నలబై రోజులు మాత్రమే ఉండటంతో సన్నద్ధం కావాలని ఆయా శాఖల అధికారులందరినీ ఆదేశించారు. వైకుంఠ ఏకాదశికి సరిపోయే పూల అలంకరణలు, వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్‌లను నియమించడం, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై కూడా ఆయన చర్చించారు.

Related Posts
సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు ఊరట
Relief for Mohan Babu in the Supreme Court

ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు హైదరాబాద్‌: సినీ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. Read more

నేడు ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక.. రఘురామ కృష్ణంరాజును ప్రకటించనున్న స్పీకర్
Election of AP Deputy Speaker today. Raghurama Krishnam Raju will be announced as Speaker

అమరావతి: ఈరోజు ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజును స్పీకర్ అయ్యన్న పాత్రుడు Read more

రాహుల్ గాంధీ పేరును ఎన్నికల గాంధీగా మార్చాలి: కేటీఆర్
రాహుల్ గాంధీ పేరును ఎన్నికల గాంధీగా మార్చాలి: కేటీఆర్

భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి. రామారావు (KTR) బుధవారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల Read more

ఢిల్లీలో 421 మార్క్‌ను దాటిన ఏక్యూఐ
Delhi's AQI crosses the 421 mark

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీవాయు కాలుష్య తీవ్రత మరోసారి ఆందోళనకర స్థాయికి చేరుకుంది. మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 మార్క్‌ను దాటేసింది. దీనితో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *