టీటీడీ ఈవో కీలక ఆదేశాలు..భక్తులు ఫుల్ హ్యాపీ

టీటీడీ ఈవో జే శ్యామలరావు తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక నుంచి తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యున్నత ప్రమాణాలతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.

తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో టీటీడీ జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. శానిటరీ మెటీరియల్స్, సిబ్బంది పనితీరు, యాంత్రీకరణ తదితర అనేక అంశాలపై ఈవో అధికారులతో చర్చించారు. అలాగే శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పలు సమస్యలను ఈవోకు తెలియజేశారు.

తిరుమలలో భక్తుల క్యూలు విస్తరించిన ప్రాంతంలో.. తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల పారిశుద్ధ్య పనితీరులో లోపం ఉందని వివరించారు. అలాగే సమయానికి శానిటరీ మెటీరియల్స్‌ను ఏజెన్సీలు సరిగ్గా సరఫరా చేయకపోవడం.. నాణ్యత లేని క్లీనింగ్ సామాన్ల సరఫరాచేయడం వంటి అంశాలను ప్రస్తావించారు.