మధ్య ప్రదేశ్లో రైలు ప్రమాదం

ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలు ఆందోళన గురి చేస్తున్నాయి. ఇటీవల రైళ్లలు మంటలు చెలరేగడం, పట్టాలు తప్పిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదం చోటు చేసుకున్నది.

మధ్యప్రదేశ్ నుంచి బిహార్ వెళ్తున్న రాణి కమలాపతి-సహర్సా ప్యాసింజర్ ఇటార్సీ జంక్షన్ వద్ద పట్టాలు తప్పింది. రెండు బోగీలు పట్టాల నుంచి పక్కకు జరిగాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. రైలు పట్టాలు తప్పిందని తెలిసి ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.