బీహార్‌ లోని హాజీపూర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం..

విద్యుత్తు వైర్లు తగిలి ఎనిమిది మంది మరణించిన ఘటన బీహార్ లలోని హాజీపూర్ జిల్లాలో జరిగింది. సుల్తానాపూర్‌ లోని హరిహరనాథ్‌ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్తున్న భక్తుల ట్రాలీకి హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తగిలాయి. దీంతో ఎనిమిది మంది యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

మరికొంతమంది భక్తులు తీవ్రంగా గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 11,000 వోల్ట్‌ కరెంట్ లైన్‌ ట్రాలీ డీజే సిస్టమ్‌ కు తగలడంతో ఈ దారుణ ఘటన జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన వైశాలిలోని హాజీపూర్ ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.