lbnagar wall collapse

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం.

ఎల్బీనగర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్ తవ్వకాల్లో అపశృతి చోటు చేసుకుంది. సెల్లార్ లోపల పనిచేస్తుండగాపైనుంచి మట్టిదిబ్బలు కూలిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందారు. మరో కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కూలీని మట్టిదిబ్బల నుంచి బయటకు తీసి సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. మట్టి దిబ్బల నుంచి ఓ మృతదేహాన్ని బయటకు తీయగా.. మరో ఇద్దరి డెడ్ బాడీలను బయటకు తీసేందుకు ఫైర్, పోలీసు సిబ్బంది శ్రమిస్తున్నారు. చనిపోయిన ముగ్గురు కూలీలు బిహార్‌కు చెందిన వారుగా గుర్తించారు.

10504 5 2 2025 12 40 6 1 DSC5687

ప్రమాదం జరిగిన వెంటనే బాధితుల్ని కాపాడేందుకు ఫైర్ సిబ్బంది, పోలీసులు ,
డి ఆర్ డిఎఫ్ సిబ్బంది ప్రయత్నించారు. సెల్లార్ కోసం తీసిన గుంతలు
లోతుగా ఉండటంతో కార్మికులు పూర్తిగా మట్టిలో కూరుకుపోయారు. భవన నిర్మాణంకోసం తీసిన గుంతలో పిల్లర్లు నిర్మించి రిటైనింగ్ వాల్స్ నిర్మాణం కోసం పనులు చేపడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది . ఫైల్స్ లో కాంక్రెట్ నింపుతుండగాఫై నుంచి మట్టి జారి పడిపోవడంతో కార్మికులు దానికిందచిక్కుకుపోయారు.భవన నిర్మాణంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఘటనలో మరో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి .క్షత్రగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు . భవన నిర్మాణ పనుల కోసం సూర్యాపేట, బీహార్ నుంచి వచ్చిన కార్మికులువిధుల్లో ఉండగా ఈ ప్రమాదం జరిగింది .ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

Related Posts
ఉగాండాలో భారీ వర్షాలు : 15 మంది మృతి, 100 మంది గాయపడ్డారు
uganda floods

ఉగాండాలో నవంబర్ 27, 2024న భారీ వర్షాలు ఒక పెద్ద విపత్తుకు కారణమయ్యాయి. ఉగాండా యొక్క తూర్పు ప్రాంతంలో బులాంబులి జిల్లాలో భారీ వర్షాల కారణంగా భూమి Read more

అల్లు అర్జున్‌కు భారీ ఊరట
allu arjun hc

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ నంద్యాలలో నమోదు అయిన కేసును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల Read more

ఏపీలో ‘అందరికీ ఇళ్లు’
Housing Scheme

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక న్యాయం, స్త్రీ సాధికారత లక్ష్యంగా 'అందరికీ ఇళ్లు' పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాలను మహిళల పేరుతో Read more

నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన
cbn guntur

గుంటూరులో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మూడు రోజులపాటు జరగనున్న జాతీయ రియల్ ఎస్టేట్ మండలి (నారేడ్కో) ఆధ్వర్యంలో ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభిస్తారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *