గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడలో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు ప్రకటించారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న కార్యక్రమానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ కారణంగా నగరంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు.
పరిమితి ప్రాంతాల్లోని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు. బెంజ్ సర్కిల్, బందర్ రోడ్డు, పుష్ప హోటల్ జంక్షన్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిపివేసి ఇతర మార్గాల ద్వారా వాహనాలను మళ్లించనున్నారు.

అలాగే, ఆర్టీసీ బస్సులు కూడా ప్రత్యేక మార్గాల్లో నడిపించబడతాయని అధికారులు తెలిపారు. విద్యార్థుల బస్సులకు ప్రత్యేక మార్గాలు నిర్ణయించారు. సిటీ శివార్ల నుంచి వచ్చే బస్సులు ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతాల్లో నిలిపి వేయబడతాయి. దీని ద్వారా విద్యార్థుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ ట్రాఫిక్ నియంత్రణలు విజయవాడలో రద్దీని తగ్గించడం, గణతంత్ర వేడుకలను సజావుగా నిర్వహించడం కోసం చేపట్టిన చర్యలని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.