నేడు ఇంటర్నేషనల్ ఎర్త్ డే ..దీన్ని ఇలా కాపాడుకుందాం..

Earth Day: నేడు ఇంటర్నేషనల్ ఎర్త్ డే ..దీని గురించి తెలుసుకుందాం

ఇంటర్నేషనల్ ఎర్త్ డేను ఏటా ఏప్రిల్ 22న నిర్వహిస్తారు. 1970‌లో ఇదే తేదీన అమెరికాలోని భిన్న నగరాల్లో దాదాపు 2 కోట్ల మంది పర్యావరణానికి జరుగుతున్న హానిపై వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. ఆ ఘటనలను గుర్తుచేయడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చేందుకు ఈ తేదీని ఎర్త్ డేగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఎర్త్ డే సందర్భంగా భూమి గురించి కొన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం.
భూమి సంపూర్ణ గోళం కాదు
భూమిని మ్యాప్‌లలో సంపూర్ణ గోళాకారంలో చూపిస్తారు. కానీ, అది నిజంకాదు. ధ్రువాల దగ్గర భూమి కాస్త సమతలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కాస్త సమతలంగా కనిపించే గోళంగా చెప్పుకోవచ్చు. ఇతర గ్రహాల తరహాలోనే సూర్యుడి చుట్టూ కక్ష్యలో తిరగడం వల్ల భూమిపై కూడా గురుత్వాకర్షణ శక్తి, అపకేంద్ర బలం (సెంట్రీఫ్యూగల్ ఫోర్స్) గట్టిగా పనిచేస్తాయి. దీని వల్ల ధ్రువాలు కాస్త సమతలంగా ఉండటంతోపాటు భూమధ్య రేఖ వద్ద వ్యాసం ఎక్కువగా ఉంటుంది.

Advertisements
నేడు ఇంటర్నేషనల్ ఎర్త్ డే ..దీన్ని ఇలా కాపాడుకుందాం..

భూమిపై 70 శాతం ఉండేది నీరే..
భూమిపై నీరు ఘన , ద్రవ, వాయు రూపాల్లో ఉంటుంది. భూమిపై దాదాపు నాలుగింట మూడొంతులు ఉండేది నీరే. హిమానీనదాలు (గ్లేసియర్లు), చిత్తడినేలలు, సరస్సులు, నదులు, సముద్రాలు, మహా సముద్రాల రూపంలో ఈ నీరు ఉంటుంది. భూమి నుంచి 100 కి.మీ. ఎత్తులో అంతరిక్షం, భూమి వాతావరణం, అంతరిక్షాల మధ్య రేఖను కర్మన్ రేఖగా పిలుస్తారు. సముద్ర తలం నుంచి వంద కి.మీ. ఎత్తులో ఇది మొదలవుతుంది. మన విశ్వంలో జీవం ఉన్నట్లు నిర్ధరించగలిగిన ఏకైక గ్రహం భూమి. ప్రస్తుతం దాదాపు 12 లక్షల జంతువులను పరిశోధకులు గుర్తించారు. అయితే, మొత్తం జంతు జాలంలో ఇవి చాలా తక్కువ శాతమని భావిస్తున్నారు. సుమారు 450 కోట్ల ఏళ్ల కిందట భూమి ఏర్పడింది.

Read Also: కొత్త పోప్ ఎన్నిక కోసం కీలకమైన ప్రక్రియ

Related Posts
Gold Price : పసిడి ధర లక్ష దాటింది
Gold Price : పసిడి ధర లక్ష దాటింది

Gold : పసిడి ధరలు లక్ష రూపాయల మార్కు దాటిన సంచలనానికి కారణం ఏమిటి? న్యూఢిల్లీ: దేశీయ బులియన్ మార్కెట్లు ఈ మధ్యకాలంలో అసాధారణంగా కళకళలాడుతున్నాయి. చరిత్రలో Read more

Student Arrest: అమెరికాలో స్టూడెంట్ అరెస్టు: చర్చనీయాంశంగా మారిన ఘటన
అమెరికాలో స్టూడెంట్ అరెస్టు: చర్చనీయాంశంగా మారిన ఘటన

విద్యార్థులపై ఇమిగ్రేషన్ కఠిన చర్యలుఅమెరికాలో అక్రమ వలసదారులు, వీసా గడువు ముగిసిన తర్వాత తిరిగి వెళ్లని వారిపై ఇమిగ్రేషన్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మసాచుసెట్స్‌లో Read more

లోయలో పడిన బస్సు.. ఏడుగురు మృతి
Bus Filled Into The Valley Seven People Were Killed

అల్మోరా: ఉత్తరాఖండ్‌లో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులున్నారు. Read more

ఢిల్లీ రాజకీయల్లో వేడి – అతిషికి రేఖా గుప్తా కౌంటర్
ఒక్కరోజు గడవకముందే విమర్శలు ఎందుకని రేఖా గుప్తా ఆగ్రహం

ఒక్కరోజు గడవకముందే విమర్శలు ఎందుకని రేఖా గుప్తా ఆగ్రహం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన తొలి రోజే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×