Today Congress Chalo Raj Bhavan

నేడు కాంగ్రెస్ చలో రాజ్ భవన్

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. గౌతమ్ అదానీ విషయంలో చర్యలు తీసుకోవాలని, మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని కోరుతూ ఈ నిరసన కార్య్రమం చేపట్టనున్నారు.

Advertisements

దేశ వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆందోళన పిలుపుతో ఇక్కడ కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకూ ర్యాలీగా వెళ్లనున్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దీపాదాస్ మున్షీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పోలీసులు ఈ సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అయితే.. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్..ఫైర్ అయ్యారు. ముఖ్య మంత్రే రాజ్ భవన్ ముట్టడికి వెళ్తే.. రాష్ర్టంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితేంటి..? అంటూ నిలదీశారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్.. సమావేశాలు తప్పించుకువడానికే ఇలాంటివి చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రభుత్వం మనుసు మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. పరిపాలన చేయడానికి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు..ధర్నాలు చేయడానికి కాదంటూ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చురకలు అంటించారు . ఈ రాష్ర్టంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం వ్యక్తం అవుతుందని ఫైర్ అయ్యారు.

Related Posts
SLBC టన్నెల్ లోకి రోబోలు
మృతదేహాల కోసం రోబోలు రంగంలోకి – హైదరాబాద్ అన్వీ రోబోటిక్ టీమ్ ప్రత్యేక ప్రదర్శన

టన్నెల్ లో చోటుచేసుకున్నప్రమాదం సందర్భంలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించడం ప్రస్తుతం అత్యవసరం అవుతోంది. ఎస్‌ఎల్‌బీసీ (సుజలాం సుఫలాం బహుద్దేశీయ కాలువ) టన్నెల్‌లో కూలిన శకలాల వల్ల చిక్కుకుపోయిన Read more

Varun Chakravarthy :స్టార్‌ హీరో కోసం 3 కథలు సిద్ధం ఎవరు ఆ స్టార్ ,ఏమిటి ఆ కథ
Varun Chakravarthy :స్టార్‌ హీరో కోసం 3 కథలు సిద్ధం ఎవరు ఆ స్టార్ ,ఏమిటి ఆ కథ

క్రికెట్, సినిమా అనే రెండు ప్రధాన రంగాల్లో భారతదేశంలో ప్రజల మక్కువ అపారమైనది. క్రికెటర్లను, సినిమా హీరోలను అభిమానులు రోల్ మోడల్స్‌గా మరికొంత మంది వాళ్లను డెమీ Read more

జార్జియాలో ఎన్నికల కమిషన్ అధికారిపై నల్లరంగు పెయింట్ విసిరిన సంఘటన..
paint

జార్జియాలో జరిగిన ఎన్నికల వివాదం నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ అధికారిపై నల్లరంగు పెయింట్ విసిరిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన, వివాదాస్పద ఎన్నికల ఫలితాలు మరియు Read more

కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు
కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో మే 15 నుండి 26వ తేదీ వరకు మహా సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు Read more

Advertisements
×