Tirupati incident తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ భారీ డబ్బు డిమాండ్

Tirupati incident : తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ : భారీ డబ్బు డిమాండ్

Tirupati incident : తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ : భారీ డబ్బు డిమాండ్ తిరుపతిలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ చేసి, భారీగా డబ్బు డిమాండ్ చేశారు. వారి కుట్రను భగ్నం చేసేందుకు రాజేష్ అనే వ్యక్తి చేసిన ప్రయత్నం హృదయ విదారకంగా మారింది.శుక్రవారం సాయంత్రం తిరుపతి జీవకోన ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజేష్ కుటుంబ సభ్యులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అంతటితో ఆగకుండా కోటి రూపాయలు ఇవ్వాలని బెదిరించారు. మిగతా కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి రాజేష్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు.చిత్తూరులో ఉన్న బంధువుల దగ్గరికి వెళ్లి డబ్బు తెస్తానని రాజేష్ నమ్మబలికాడు. దుండగులు అంగీకరించడంతో, అతనిని కూడా వెంట తీసుకెళ్లారు. అయితే, ప్రయాణం మద్యలో ఐతే పల్లె వద్ద కారులో నుంచి రాజేష్ బలవంతంగా దూకేశాడు. ఈ ఘటనతో తీవ్ర గాయాలపాలైన రాజేష్ అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయాడు.బహిరంగ రహదారిపై గాయాలతో ఉండగానే, అక్కడి స్థానికులు అతన్ని గమనించారు.

Advertisements
Tirupati incident తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ భారీ డబ్బు డిమాండ్
Tirupati incident తిరుపతిలో ఓ కుటుంబాన్ని దుండగులు కిడ్నాప్ భారీ డబ్బు డిమాండ్

వెంటనే 100 నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.తక్షణమే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాజేష్‌ను ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులను దుండగులు కిడ్నాప్ చేశారని, తాను తప్పించుకున్నానని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.గాయాలు తీవ్రంగా ఉండటంతో పోలీసులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా రాజేష్‌ను తిరుపతి రుయా హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. “నా భార్య, పిల్లలను కాపాడండి” అంటూ వేడుకున్నాడు.ఈ విషయం తెలుసుకున్న అలిపిరి పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్‌కు గురైన కుటుంబ సభ్యుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే పూర్తి వివరాలు వెలుగు చూడనున్నాయి.

Related Posts
అన్ని బస్సులకు ఉచిత ప్రయాణం :చంద్రబాబు నాయుడు
అన్ని బస్సులకు ఉచిత ప్రయాణం :చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే విషయంపై వైసీపీ, టీడీపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు Read more

కాకినాడలో పెద్దపులి సంచారం
tiger

ప్రస్తుతం కాకినాడ జిల్లాలో పెద్దపులి భయం కొనసాగుతుంది. పెద్ద పులి ఆ ప్రాంతంలో తిరుగుతున్న నేపథ్యంలో అక్కడ పర్యాటానికి సైతం దాదాపుగా 10 రోజులుగా బ్రేక్ పడింది. Read more

అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పు లేదు – మంత్రి నారాయణ
అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పు లేదు - మంత్రి నారాయణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పులు లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను Read more

Boma Akhila Priya : భూమా అఖిలప్రియ నిరసన
akhila priya prostest

టీడీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇవాళ దిన్నెదేవరపాడు వద్ద సాక్షి కార్యాలయం ఎదుట కోళ్లతో నిరసన తెలిపారు. గతంలో విలేకరుల సమావేశంలో పేపర్‌లో వచ్చే ధరకే Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×