తిరుమల క్యూలో గుండెపోటుతో మహిళ మృతి

వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న భక్తురాలు ఝాన్సీ(32) గుండెపోటుతో కుప్పకూలింది. తోటి భక్తులు, నర్సులు సీపీఆర్ చేసి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించేలోపు ఆమె ప్రాణాలు కోల్పోయింది.

కడపకు చెందిన ఝాన్సీకి ఇద్దరు కవల పిల్లలున్నారు. కాగా అంబులెన్స్ గంట ఆలస్యంగా రావడంతోనే తమ కూతురు చనిపోయిందని తండ్రి బోరున విలపించాడు. తన కూతురికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారని, వారి పరిస్థితి ఏంటని ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అంబులెన్స్ వెంట వెళ్లిన తోటి భక్తులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.