తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంపై విమానాలు తిరుగుతూ కనిపించడం భక్తులలో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. ఇది కేవలం భద్రతా దృష్టికోణంలోనే కాదు, ఆధ్యాత్మికంగా కూడా చాలా కీలకమైన అంశంగా మారింది. శ్రీవారి ఆలయం ఉన్న తిరుమల పర్వతం దేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ దైవిక నిబంధనలతో పాటు శాస్త్రోక్త నియమాలు కూడా చాలా ఖచ్చితంగా పాటించాలి. అయితే ఇటీవల కాలంలో ఆ నియమాలను అతిక్రమిస్తూ విమానాలు(Airplanes) తిరుమల గగనతలంలో చక్కర్లు కొడుతుండటంపై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఉదయం ఏకంగా మూడు విమానాలు ఆనంద నిలయం మీదుగా గగనతలంలో ప్రయాణించడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన కేవలం ప్రోటోకాల్ను మాత్రమే కాదు, భక్తుల విశ్వాసాన్ని కూడా దెబ్బతీసేలా ఉందని పలువురు పేర్కొన్నారు. ఇది నిన్నటి రోజు జరిగిన మరో విమాన ప్రయాణానికి కొనసాగింపుగా ఉందని సమాచారం. రెండు రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో గగనతల ఉల్లంఘనలు చోటుచేసుకోవడం పై అధికారులు తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. తిరుమల ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఆలయంపై విమానాలు ప్రయాణించడం నిషిద్ధం. అయినప్పటికీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భక్తుల డిమాండ్:
నిన్న ఉదయం కూడా ఓ విమానం స్వామివారి ఆలయం మీదుగా వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనలపై టీటీడీ భద్రతా విభాగం అధికారులు ఆరా తీస్తున్నారు. తరచూ జరుగుతున్న ఈ ఉల్లంఘనల దృష్ట్యా, తిరుమల క్షేత్రాన్ని పూర్తిస్థాయి “నో ఫ్లై జోన్”(Noflyzone) గా ప్రకటించి, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
Read also: TTD: టీటీడీ భక్తులు అసంతృప్తితో వెళ్లిపోతున్నారు:వెంకయ్య చౌదరి