clp meeting

సీఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ (సీఎల్పీ) సమావేశం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో కొనసాగుతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై ముఖ్యంగా చర్చ జరిగింది. మొత్తం 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణను చారిత్రాత్మక నిర్ణయాలుగా అభివర్ణించి, వీటి ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.

cng clp

ఈ మేరకు తెలంగాణలో రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బీసీ కులగణన సభను ఉత్తర తెలంగాణలో, ఎస్సీ వర్గీకరణ సభను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సభలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. వీటిని విజయవంతం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని నేతలకు సూచించారు.

అయితే, ఈ సమావేశానికి ఇటీవల పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ, వారు చివరి నిమిషంలో డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ అధిష్టానం వారిని సమావేశానికి హాజరయ్యేందుకు ఆహ్వానించినప్పటికీ, వారు గైర్హాజరయ్యారు. ప్రస్తుతానికి ఈ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున, ఈ సమావేశానికి హాజరైతే రాజకీయంగా నష్టపోతామని భావించి, తమ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లకుండా దూరంగా ఉండాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Related Posts
సంగారెడ్డి జైలు నుంచి లగచర్ల రైతుల విడుదల
lagacharla farmers released

లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్టైన రైతులు, సంగారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్బంగా గిరిజన సంఘాలు వారికీ స్వాగతం పలికారు. రైతులను జైలు నుంచి Read more

నుమాయిష్ లో చేదు సంఘటన
నుమాయిష్ లో చేదు సంఘటన

జాయ్ రైడ్ కోసం డబుల్ ఆర్మ్ రేంజర్లో ఉన్నవారికి భయంకరమైన అనుభవం కలిగింది, ఎందుకంటే యంత్రం సాంకేతిక సమస్యను అభివృద్ధి చేసిన తర్వాత వారు తలక్రిందులుగా ఉండవలసి Read more

పెద్దపల్లి శివాలయంలో నాగదేవత విగ్రహం వద్ద నాగుపాము దర్శనం – భక్తుల ఉత్సాహం
ఓదెల శివాలయంలో మహాశివరాత్రి రోజున నాగుపాము దర్శనం

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని, తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలోని ప్రసిద్ధ శివాలయంలో ఒక అపూర్వ సంఘటన చోటు చేసుకుంది. శివాలయ ఆవరణలో ఉన్న నాగదేవత Read more

తెలంగాణ మహిళా కమిషన్‌కు వేణుస్వామి క్షమాపణలు
Venuswamy apologizes to Telangana Women Commission

హైదరాబాద్‌: జ్యోతిష్యుడు వేణుస్వామి తెలంగాణ మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. నటీనటుల వ్యక్తిగత జీవితాలపై గతంలో వేణుస్వామి వ్యాఖ్యలు చేశారు. Read more