CM Breakfast scheme

తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం ఇదే..!

రాష్ట్రంలో 10వ తరగతికి సిద్దమవుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా మెనూ రూపొందించారు రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్‌ స్కూళ్లలో పదో తరగతి చదువుతూ ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు సర్కారు సాయంత్రం పూట అల్పాహారం అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం శనివారం నుంచి అమల్లోకి వచ్చింది.

Healthy Indian Snack Recipes for Kids

తృణధాన్యాలతో చేసిన బిస్కెట్లు (మిల్లెట్ బిస్కెట్లు), పల్లీ చిక్కీ, ఉడకబెట్టిన బొబ్బర్లు (పెద్ద శనగలు), ఉల్లిపాయ పకోడీలు, ఉడకబెట్టిన పెసర్లు, శనగలు-ఉల్లిపాయ వంటి  వంటకాలను రోజుకొకటి చొప్పున విద్యార్థులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ స్నాక్స్ కోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనున్నారు. అందుకోసం, స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ ఖాతాలకు నిధులు బదిలీ చేయనున్నారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు తెలంగాణలో టెన్త్ క్లాస్ పరీక్షలు జరగనుండగా… ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్స్ లో స్నాక్స్ అందించనున్నారు.

Related Posts
2 లక్షల ఉద్యోగాలు కాదు..ఉన్నవి తీసేస్తున్నారు..కేటీఆర్‌ ఆగ్రహం
KTR tweet on the news of the arrest

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాపపు పాలనలో ప్రతి బిడ్డా నిరాశలో ఉన్నారని ఆరోపించారు. 165 ఏఈఓలు, Read more

సింగరేణి లో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలి – సింగరేణి ఛైర్మెన్
singareni praja palana vija

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా నిర్వహించనున్న ‘ప్రజాపాలన -ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమాన్ని రా ష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సింగరేణిలో ఘనంగా Read more

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు
Yadagirigutta Devasthanam Board on the lines of TTD

హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు Read more

రేషన్ కార్డులపై భట్టి కీలక ప్రకటన
Bhatti's key announcement on ration cards

రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీపై డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *