ratan tata last post

రతన్ టాటా చివరి పోస్ట్ ఇదే..

ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చేసిన లాస్ట్ పోస్ట్ వైరలవుతోంది. 3 రోజుల క్రితం తన ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేయొద్దని ట్విటర్ వేదికగా ఆయన ప్రకటన చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తన గురించి ఆలోచిస్తున్నందుకు ధన్య వాదాలు తెలిపారు. దురదృష్టవశాత్తు పోస్ట్ చేసిన మూడు రోజులకే ఆయన చనిపోయారు.

ఇక రతన్ టాటా అందుకున్న పురస్కారాలు చూస్తే..

రతన్ టాటా తన జీవిత కాలంలో స్వదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ అనేక గౌరవ పురస్కారాలను అందుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే మెడల్, అంతర్జాతీయ విశిష్ఠ సాఫల్య పురస్కారం, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ గ్రాండ్ ఆఫీసర్ అవార్డు, నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్(UK), ఓస్లో బిజినెస్ ఫర్ పీస్ అవార్డు వంటి అవార్డులు, అనేక డాక్టరేట్లు తన ఖాతాలో ఉన్నాయి.

రతన్ టాటా విజయాలివే చూస్తే..

అనుభవలేమితో కెరీర్ ప్రారంభంలో రతన్ టాటా అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. వాటినే సోపానాలుగా మలుచుకొని ఛైర్మన్ అయ్యాక తనదైన నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా టాటా గ్రూప్ను విస్తరించారు. లండన్ టెట్లీ టీ కొనుగోలు, కార్ల తయారీ సంస్థలు జాగ్వార్, ల్యాండ్ రోవర్తో పాటు కోరస్ స్టీల్ను టాటాలో భాగం చేశారు. దీంతో పాటు ఐటీ, టెలి కమ్యూనికేషన్స్, ఆటో మొబైల్స్ రంగాల్లోనూ సంస్థను విస్తృతం చేసి సక్సెస్ అయ్యారు.

Related Posts
యూపీ, తమిళనాడులో ఉప ఎన్నికలు
elections

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. Read more

ఉత్త‌రాదిలో కూట‌మి నేత‌ల హ‌వా!
ఉత్త‌రాదిలో కూట‌మి నేత‌ల హ‌వా!

ఉత్త‌రాదిలో ఏపీ కూట‌మి నేత‌ల హ‌వా కొన‌సాగుతోంది. మొన్న మ‌హారాష్ట్ర‌లో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారం చేయ‌గా, అక్క‌డ బీజేపీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. నిన్న ఢిల్లీలో Read more

సంక్రాంతి సెలవులను తగ్గించిన ఏపీ సర్కార్
sankranthi holidays school

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవులపై షాక్ ఇచ్చింది. మార్చిలో పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, సాధారణంగా ఇచ్చే సెలవుల్ని కేవలం మూడు రోజులకు Read more

హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్
Telangana CM Revanth returns to Hyderabad from Davos

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఆయనకు ఘనంగా స్వాగతం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *