ఏపీలో అమలు చేస్తున్న పథకాలను తెలంగాణ మేనిఫెస్టోలో ప్రకటించారుః మంత్రి అమర్నాథ్

కెసిఆర్, హరీశ్ రావు వ్యాఖ్యలను ఖండించిన అమర్నాథ్ రెడ్డి

gudivada-amarnath

అమరావతిః సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అమర్నాథ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కెసిఆర్, హరీశ్ రావుల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ను కించపరిచేలా ప్రసంగాలు చేయడం బిఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం సరికాదన్నారు. ఏపీలో అమలు చేస్తున్న పథకాలను తెలంగాణ మేనిఫెస్టోలో ప్రకటించారని విమర్శించారు. బిఆర్ఎస్ నేతలు తెలంగాణలో చేసిన అభివృద్ధి పనులపై మాట్లాడాలని సూచించారు. తెలంగాణ రోడ్లు, ఏపీ రోడ్లను చూడాలని, అలాగే ఏపీలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని కెసిఆర్ ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ఆశీర్వాద సభలలో అన్నారు. అంతకుముందు హరీశ్ రావు.. హైదరాబాద్‌ను, అమరావతిని పోలుస్తూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి తీవ్రంగా స్పందించారు.