ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. గతవారం ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేట పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోసాని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ నేడు విచారణకు రాగా పరిశీలించిన కోర్టు, పోసానిపై తదుపరి చర్యలు చేపట్టవద్దని పోలీసులను ఆదేశించింది.ఈ కేసులో సెక్షన్ 111తో పాటు, ఒక మహిళను అసభ్యంగా చిత్రీకరించారనే ఆరోపణలపై పోసానిపై అదనపు సెక్షన్లు చేర్చడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించారంటూ విచారణ అధికారి మురళీకృష్ణపై సీరియస్ అయింది. ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని నిలదీసింది. మురళీకృష్ణకు ఫామ్ 1 నోటీసు జారీ చేసి, రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
సీఐడీ కార్యాలయం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 15కి పైగా కేసులు నమోదయ్యాయి.రెండు రోజుల క్రితం,సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో పోసాని పై మరో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 15న విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు అందజేశారు. ఈ నోటీసులను సీఐడీ కార్యాలయంలో సంతకం చేయడానికి వచ్చిన సమయంలో ఆయనకు అందజేశారు. గుంటూరు కోర్టు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కొన్ని షరతులను విధించింది. అందులో ముఖ్యంగా, ప్రతి సోమవారం, గురువారం మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో సంతకం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు, పోసాని ఇటీవల సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకాలు చేశారు. పోసాని కృష్ణమురళిపై అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. అదనంగా, పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టు ఆయనను పోలీస్ కస్టడీకి అప్పగించాలని కోరిన పిటిషన్ను దాఖలు చేసింది. ఈ క్రమంలో ఆయన పలు జైళ్లలో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపారు. గత నెలలో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, పోసాని కృష్ణమురళి చట్టపరమైన సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆయనపై నమోదైన కేసులు, కోర్టు విచారణలు, ఆరోగ్య పరిస్థితులు వంటి అంశాలు సమన్వయం కావాల్సిన అవసరం ఉంది.

Read Also: China: బ్యాంకాక్ లో కుప్పకూలిన 30 అంతస్తుల బిల్డింగ్ ..పోలీసుల అదుపులో చైనా పౌరులు