రామ్మోహన్ లాంటి నాయకుడు దేశానికి అవసరం – MP విశ్వేశ్వర్ రెడ్డి

టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఫై తెలంగాణ బిజెపి ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అభినందనలు తెలిపారు. ‘2014లో యంగెస్ట్ ఎంపీల్లో మీరూ ఒకరు. లోక్ సభలో మీ పనితీరు అద్భుతంగా ఉండేది. అప్పుడే సీనియర్ ఎంపీలందరూ మిమ్మల్ని గుర్తించారు. మన దేశానికి మీలాంటి విజ్ఞానవంతులు, వాగ్ధాటి గల యువ నాయకుడు అవసరం. మిమ్మల్ని కేంద్రమంత్రిగా చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని ట్వీట్ చేశారు.

నిన్న గురువారం ఢిల్లీలోని తన కార్యాలయంలో మధ్యాహ్నం 01:10 గంటల సమయంలో కేంద్ర పౌర విమానా శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు తీసుకున్నారు. దేశంలో అత్యంత పిన్న వయసులో కేంద్ర కేబినెట్ మంత్రి పదవి రామ్మోహన్ చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీకాకుళం ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. సీఎం చంద్రబాబు తనకు కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారన్నారు. తనపై నమ్మకంతో ప్రధాని నరేంద్ర మోదీ.. పౌర విమానయాన శాఖ అప్పగించారన్నారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని అన్ని శాఖలను మోదీ కోరారని మంత్రి చెప్పుకొచ్చారు.

Thank you Shri @KVishReddy garu, MP Loksabha & Prof. Seetaram Naik, Ex-MP for calling upon me after taking charge as Civil Aviation Minister at Rajiv Bhavan. pic.twitter.com/1CNUWKsMjP— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 13, 2024