gbs syndrome

మహారాష్ట్రలో వణుకు పుట్టిస్తున్న ‘జీబీఎస్’ వైరస్

దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ (GBS) కలవరపెడుతోంది. తొలుత మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌‌లో వెలుగులోకి వచ్చిన జీబీఎస్.. క్రమంగా మిగతా రాష్ట్రాలకు విస్తరిస్తుంది. ఉహించిన దానికంటే వేగంగానే ఇతర రాష్ట్రాలకు ఈ వ్యాధి వ్యాప్తిచెందుతోంది. క్రమంగా మహారాష్ట్రలో జీబీఎస్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర లో ప్రస్తుతం 163 మందికి ఈ వైరస్ నిర్దారణ కాగా.. ఒక్క పుణే జిల్లాలోనే 149 కేసులు ఉన్నాయి. తాజాగా, నాందేడ్‌లో జీబీఎస్ బారినపడి చికిత్స పొందూ 60ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. దీంతో మొత్తం జీబీఎస్ మరణాలు సంఖ్య 5కు చేరింది.మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ.. ‘సోమవారం కొత్తగా ఐదుగురికి జీబీఎస్ నిర్దారణ అయ్యింది.. ఎటువంటి మరణం లేదు.. ఇప్పటి వరకూ 127 కేసులు నిర్దారణ అయ్యాయి.. అనుమానిత 163 కేసుల్లో పుణే నగరంలో 32, ఇటీవల పుణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్తగా చేరిన గ్రామాల్లో 86, పింప్రి చించువాడలో 18, పుణే గ్రామీణ జిల్లాలో 19, ఇతర జిల్లాల్లో 8 మంది ఉన్నారు’ అని తెలిపారు. జీబీఎస్ బారినపడ్డవారిలో ఇప్పటి వరకూ 47 మంది కోలుకున్నారని చెప్పారు. మరో 47 మంది ఐసీయూలోనూ.. 21 మంది వెంటలేటర్‌పైన చికిత్స పొందుతున్నట్టు వివరించారు.

బ్యాక్టీరియా లేదా కలుషిత ఆహారంద్వారా ఈ సిండ్రోమ్‌ వ్యాప్తిచెందుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. జ్వరం, వాంతులు, ఒళ్లంతా తిమ్మిర్లు, విరేచనాలు, పొత్తి కడుపులో నొప్పి, నీరసం, కండరాల బలహీనత లాంటి లక్షణాలు జీబీఎస్ బాధితుల్లో కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే, ఇది కరోనా లాగా అంటువ్యాధి కాదని, ఒకరి నుంచి ఒకరికి సోకదని, అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటే చాలని అంటున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను కలిసి.. పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు .

Related Posts
కేరళకు ఉప్పెన ముప్పు..
kerala uppena

కేరళ, తమిళనాడు తీరాలకు సంబంధించి అధికారుల నుండి తీవ్ర హెచ్చరికలు వెలువడ్డాయి. సముద్రంలో అకస్మాత్తుగా సంభవించే మార్పులను కల్లక్కడల్ అని పిలుస్తారు. ఇవి ప్రమాదకరమైన అలలతో తీర Read more

ప్రధానికి హృదయపూర్వక స్వాగతం: పవన్ కళ్యాణ్
Warm welcome to Prime Minister.. Pawan Kalyan

అమరావతి: నేడు ఏపీలోని విశాఖలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. Read more

Ranya Rao: రన్యారావు దర్యాప్తు వెలుగులో సంచలన విషయాలు
Ranya Rao: రన్యారావు దర్యాప్తు వెలుగులో సంచలన విషయాలు

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా కేసు బీభత్సం సృష్టిస్తోంది. ఈ కేసులో నటి రన్యా రావు ప్రధాన నిందితురాలిగా బయటపడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ Read more

ఆ విమానాలు అమృత్‌సర్‌కే ఎందుకొస్తున్నాయి..?: పంజాబ్ సీఎం
Why are the flights going to Amritsar.. Punjab CM

పంజాబ్ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నమన్న సీఎం న్యూఢిల్లీ: అమెరికా నుంచి వలసదారులను తీసుకొచ్చిన విమానం గతవారం అమృత్‌సర్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన విషయం విషయం తెలిసిందే. మొత్తం 104 Read more