భట్టి విక్రమార్కను కలిసిన టీజీయూ ఈఈయూ నాయకులు

Bhatti Vikramarka

హైదరాబాద్‌: భగత్ నగర్ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీ జీ యూ ఈ ఈ యూనియన్ నాయకులు మంగళవారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వినతి పత్రం అందజేశారు. అనంతరం టీ జీ యూ ఈ ఈ యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. విద్యుత్ కార్మికులను ఆర్టిజన్ గా గుర్తించడం ,ఆర్టిజన్ కార్మికుల కు కన్వర్షన్ ఇవ్వడం, బిల్ కలెక్టర్లకు కనీస వేతనం వంటి పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా అయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నలువాల స్వామి, ఎన్పీడీసీఎల్ కంపెనీ సెక్రటరీ ఎం ప్రసాద్, కరీంనగర్ రీజినల్ సెక్రటరీ రాచకొండ శ్రీనివాస్, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ప్రసాద్ రాజు పాల్గొన్నారు.