TG Inter Results: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

TG Inter Results: మరికాసేపట్లో తెలంగాణలో ఇంటర్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22, 2025 (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల కాబోతున్నాయి. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

Advertisements

ఫలితాల విడుదలకు ముందు విద్యార్థుల్లో ఉత్కంఠ

ఇంటర్ ఫలితాల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. వీరిలో 4.88 లక్షల మంది ఫస్ట్ ఇయర్, 5 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులకు పలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. https://tsbie.cgg.gov.in ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌ లోనూ నేరుగా ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే ఐవీఆర్‌ పోర్టల్‌ 9240205555 ఫోన్‌నంబర్‌ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి ఫలితాలు పొందొచ్చు.

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 9.50 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు.. 5 లక్షలకుపైగా సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల అనంతరం మార్చి 19 నుంచి ఏప్రిల్‌ 10వ తేదీ వరకు మూల్యాంకనం ప్రక్రియ కొనసాగింది. తమ ఫలితాలపై అనుమానాలున్న విద్యార్థులు ఇంటర్ బోర్డు ద్వారా రీవాల్యుయేషన్ లేదా రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి వివరాలను ఇంటర్ బోర్డు త్వరలో ప్రకటించనుంది.

Read also: Revanth Reddy: మహిళల అభివృద్ధికి సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

Related Posts
రేపే గ్రూప్ 1 ఫలితాలు విడుదల
గ్రూప్-1 రాత పరీక్ష ఫలితాలు రేపు ఉదయం విడుదల

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. టీఎస్‌పీఎస్సీ (TSPSC) అధికారిక ప్రకటన మేరకు గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షల ఫలితాలు మార్చి Read more

వక్ఫ్ బిల్లుపై అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్

వక్ఫ్ సవరణ బిల్లు 2024ను పార్లమెంట్ ముందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ ఎంపీ, ఆల్ Read more

Secretariat Staff : మేలో సచివాలయాల సిబ్బంది బదిలీలు?
Ap Secretariat Staff

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా జనరల్ కేటగిరీ సిబ్బందిపై కుదింపును పూర్తి Read more

చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షా భేటీ
చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోంమంత్రి అమిత్ షా భేటీ

అమరావతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఎన్డీఏ నేతల సమావేశం కీలకంగా మారింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ గంటన్నర పాటు సాగింది. Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×