తెలంగాణ టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ) ఫలితాలు విడుదలయ్యాయి.విద్యాశాఖ కార్యదర్శి యోగిత ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఈ ఎగ్జామ్స్ కు 1,35,802 మంది హాజరయ్యారు. వీరిలో 42,384 టెట్లో 31.21 శాతం మంది అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, తెలంగాణ టెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. 1 నుంచి 5 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే అభ్యర్థులు పేపర్-1ని… 6 నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే వారు పేపర్-2ను ఎంపిక చేసుకుంటారు. ఇక టీచర్ ఉద్యోగాల భర్తీ సయమంలో టెట్లో సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారనే విషయం తెలిసిందే. ఇకపై ప్రతి సంవత్సరం టెట్ను నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటించింది. టెట్లో 31.21 శాతం మంది అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
