జమ్మూకశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజౌరీ గుండా ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 3.30 నిమిషాల సమయంలో కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు చేశాయి. ఈ దాడుల్లో ఓ జవాన్‌కు గాయాలయ్యాయి. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జులై 19న కెరాన్ సెక్టర్‌లో చొరబాటుకు ఇద్దరు ఉగ్రవాదులు యత్నించారు.

ఈ కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఇటీవల దోడా జిల్లాలోని.. కస్తిగఢ్‌లో కూడా ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికిలు గాయపడ్డారు. అంతకుముందు దోడా ఎన్‌కౌంటర్‌లో ఓ అధికారితో సహా నలుగురు సైనికులు వీర మరణం పొందారు. అయితే గత 200 రోజుల్లోనే దాదాపు 20 సార్లు ఉగ్రావాదులు దాడులకు పాల్పడడం జరిగింది.