మిలిటరీ స్థావరంపై ఉగ్రవాదుల దాడి.. జవానుకు గాయాలు

Terrorist attack on military base.. Soldiers injured

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూ దర్బార్‌ సమీపంలోని సుంజ్వాన్‌ మిలిటరీ స్థావరం పై సోమవారం దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ ఆర్మీ జవాన్ గాయపడినట్లు అధికారులు తెలిపారు. శాంట్రీ పోస్ట్ ప్రాంతానికి సమీపంలోని 36వ ఇన్‌ఫ్రాంట్రీ బ్రిగేడ్‌తో కూడిన క్యాంపు వద్ద ఈ దాడి జరిగినట్లు తెలిపారు. అప్రమత్తమైన ఆర్మీ.. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. గాయపడిన జవాన్‌ను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.