తెలంగాణ టెన్త్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు విడుద‌ల‌

Telangana 10th class exam results released

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షా ఫ‌లితాలు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు విడుద‌ల‌య్యాయి. సప్లిమెంటరీ పరీక్ష‌ల్లో 73 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. ఇందులో అబ్బాయిల ఉత్తీర్ణ‌త 71.01 శాతం కాగా, అమ్మాయిల ఉత్తీర్ణ‌త‌ 76.37 శాతంగా న‌మోదైంది.

అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్‌ 3 నుంచి జూన్ 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.