acid attack

Acid Attack : కువైట్‌లో తెలుగు మహిళపై యాసిడ్ తో దాడి

ఆర్థిక అవసరాల కోసం కువైట్‌కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళపై యజమానులు యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. కాకినాడ జిల్లా యూ.కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన కాకాడ లక్ష్మి, భర్త మరణంతో జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లా చెందిన ఓ ఏజెంట్ ద్వారా రెండు నెలల క్రితం కువైట్‌కు వెళ్లింది. ఓ ఇంట్లో పని చేస్తే నెలకు 150 దీనార్లు వేతనం ఇస్తామని చెప్పగా, అక్కడ చేరిన తర్వాత కేవలం 100 దీనార్లు మాత్రమే ఇవ్వడం ప్రారంభించారు.

Advertisements

ప్రశ్నకు ప్రతిగా దాడి – ఆసుపత్రిలో చికిత్స

తన వేతనాన్ని తగ్గించిన విషయంపై యజమానులను ప్రశ్నించగానే లక్ష్మిపై వారు కిరాతకంగా యాసిడ్ పోసి దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మిని పిచ్చాసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటన పది రోజుల క్రితం జరిగినట్టు తెలుస్తోంది. కోలుకున్న తర్వాత ఆసుపత్రి సిబ్బందికి వివరాలు చెప్పిన లక్ష్మి ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి సిబ్బంది ఆమెకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించి, ఆమె కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు.

woman suffers acid attack i
woman suffers acid attack i

పాస్‌పోర్టు అడ్డుకోవడం – ప్రభుత్వ స్పందనకు వేచి

లక్ష్మి తెలిపిన సమాచారం ప్రకారం, ఆమె పాస్‌పోర్టు యజమానుల వద్దే ఉండిపోయింది. కేసును వెనక్కి తీసుకుంటేనే దానిని ఇవ్వబోతున్నామని బెదిరిస్తున్నారట. దీంతో ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోనే చిక్కుకుని తీవ్ర మనోవేదనతో ఉంది. లక్ష్మిని అక్కడికి పంపిన ఏజెంట్‌ను సంప్రదించగా, తిరిగి పంపించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి లక్ష్మిని భారత్‌కు రప్పించాలని, న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Related Posts
30వ ఇండియన్ ప్లంబింగ్ కాన్ఫరెన్స్‌కు సిద్ధమైన హైదరాబాద్..
Hyderabad is ready for the 30th Indian Plumbing Conference

హైదరాబాద్‌: 1,500 కు పైగా అంతర్జాతీయ డెలిగేట్‌లు 3-రోజుల పాటు జరిగే మెగా కాన్ఫరెన్స్ కు హాజరుకానున్నారు. భారతదేశపు ప్లంబింగ్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ, Read more

Posani Krishna Murali: పోసాని కండిషన్ తో కూడిన బెయిల్
Posani Krishna Murali: పోసాని కండిషన్ తో కూడిన బెయిల్

గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు ఊరట కల్పించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరియు మంత్రి నారా Read more

తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
High tension at Telangana Bhavan. Heavy deployment of police

హైదరాబాద్‌: ఫార్ములా-ఈ కారు రే సు కేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోమవారం మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించనుంది. ఈ నెల 6న ఉదయం Read more

మరో 487 వలసదారుల బహిష్కరణ
మరో 487 వలసదారుల బహిష్కరణ

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 487 మంది భారతీయ వలసదారులను త్వరలో బహిష్కరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు భారత ప్రభుత్వానికి తెలియజేశారని, వారిపై Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×