పిల్లలకు కారం భోజనం పెట్టడమేంటి..? కేటీఆర్
నిజామాబాద్ జిల్లా కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహన భోజన పథకంలో కారం అన్నం పెట్టడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించటంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసారు. పిల్లలకు మంచి భోజనం పెట్టకపోగా, కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ను కూడా రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
మధ్యాహ్న భోజనంలో కారం లేని పప్పు వడ్డించారని, పిల్లలు తినేందుకు ఇష్టపడకపోవడంతో వాళ్లకు గొడ్డు కారం, నూనె పోసి భోజనం పెట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు ఇలాంటి ఆహారం అందిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాఠశాలల్లో విద్యార్థులకు పెడుతున్న భోజనం నాణ్యత విషయంలో సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేటీఆర్ కోరారు.