Telangana : ఖజానాపై ఆర్థిక నియంత్రణ చర్యలు ప్రారంభం

Telangana : ఖజానాపై ఆర్థిక నియంత్రణ చర్యలు ప్రారంభం

Telangana : ఖజానాపై ఆర్థిక నియంత్రణ – వ్యయ నియంత్రణతో పాటు ఆదాయ వనరుల పెంపుపై దృష్టి

Advertisements

తెలంగాణలో పెరుగుతున్న ప్రభుత్వ వ్యయాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఆర్థిక చర్యలు చేపట్టింది. 6 గ్యారంటీ పథకాల అమలుతో పాటు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు వంటి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో, ఖజానాపై భారం తగ్గించే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో ప్రభుత్వం పన్నుల ఆధారిత వసూళ్లను పెంచడమే కాకుండా, పన్నేతర ఆదాయాన్ని పెంచే వ్యూహాన్ని కూడా అమలు చేస్తోంది.విభిన్న ప్రభుత్వ శాఖల్లో నిధుల వినియోగంపై కఠిన ఆంక్షలు విధిస్తూ, అవసరమైన పనులకే నిధులు ఖర్చు చేయాలంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ముఖ్యంగా మైనింగ్ రాయల్టీలు, ఇసుక అమ్మకాలు, నిరుపయోగ భూముల విక్రయాలు, రాజీవ్ స్వగృహ హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన ఆదాయ వనరులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. భూముల విలువలను మళ్లీ సవరించి ఎక్కువగా లభించేలా చర్యలు చేపడుతోంది.ఆర్థిక శాఖ ఇప్పటికే పన్ను లీకేజీల నియంత్రణ, వ్యర్థ వ్యయాల అరికటనకు చర్యలు ప్రారంభించింది. పన్ను రహిత ఆదాయ వనరులను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలపై అధిక భారం పడకుండా అదనపు ఆదాయం సమీకరించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.

 Telangana : ఖజానాపై ఆర్థిక నియంత్రణ చర్యలు ప్రారంభం
Telangana : ఖజానాపై ఆర్థిక నియంత్రణ చర్యలు ప్రారంభం

2024–25 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు నాటికి రాష్ట్రానికి రూ.2,00,632 కోట్లు ఆదాయం లభించగా, మొత్తం వ్యయం రూ.1,97,066 కోట్లుగా నమోదైంది. ఇందులో రెవెన్యూ ఆదాయం రూ.1,36,136 కోట్లు కాగా, వస్తు సేవల పన్ను ద్వారా రూ.46,440 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.7,033 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా రూ.29,239 కోట్లు, ఎక్సైజ్ సుంకాల ద్వారా రూ.16,808 కోట్లు వసూలయ్యాయి. పన్నేతర ఆదాయం కింద రూ.6,071.98 కోట్లు సమకూరాయి.అదేవిధంగా ప్రభుత్వం మార్కెట్ రుణాలుగా రూ.64,456.79 కోట్లు తీసుకుంది. ఇందులో ఉద్యోగుల జీతాలకే రూ.38,962.53 కోట్లు, వివిధ పథకాల కోసం రూ.73,455.82 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.24,078.06 కోట్లు, పెన్షన్లకు రూ.15,480.84 కోట్లు, సబ్సిడీలకు రూ.12,291.60 కోట్లు ఖర్చు చేసింది. ఈ నేపథ్యంలో ఖర్చులను సమర్థంగా నియంత్రిస్తూ, ఆదాయ వనరుల పెంపు ద్వారా ఆర్థిక స్థిరత సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది.

Read More : Academy Awards: 2026 ఆస్కార్ అవార్డులకు నూతన నిబంధనలు

Related Posts
Gold Price : ప్రతీకారం ఎఫెక్ట్..గోల్డ్ ప్రియులకు షాక్
Gold: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న అస్థిర పరిస్థితులు, వాణిజ్య యుద్ధాల ఉత్కంఠ నేపథ్యంలో బంగారం ధరలు చరిత్రలో తొలిసారిగా అత్యంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ Read more

రైతుల నిరసనలు: పంజాబ్‌లో బంద్
రైతుల నిరసనలు: పంజాబ్‌లో బంద్

రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) మరియు కిసాన్ మజ్దూర్ మోర్చా పంజాబ్ బంద్‌కు Read more

Canada Election: ట్రంప్ కు వ్యతిరేక భావాలే మార్క్ కార్నీవిజయానికి నాంది?
ట్రంప్ కు వ్యతిరేక భావాలే మార్క్ కార్నీవిజయానికి నాంది!

కెనడా రాజకీయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఏప్రిల్ 28, 2025న జరిగిన సమాఖ్య ఎన్నికల్లో, మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ, పియరీ పోయిలివ్రే కన్జర్వేటివ్ పార్టీని Read more

Waqf Bill: దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వక్ఫ్ బిల్లు
దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వక్ఫ్ బిల్లు

దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన వక్ఫ్(సవరణ) బిల్లు-2025కు లోక్ సభ ఆమోదం తెలిపింది. సుమారు 14 గంటలకు పైగా లోక్ సభలో చర్చ జరిగింది. సుదీర్ఘ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×