హైకోర్టులో రఘురామకృష్ణరాజుకు భారీ ఊరట
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు ఊరట లభించింది. ఇంద్-భారత్ పవర్ జెన్కాం లిమిటెడ్ దివాలా ప్రక్రియకు సంబంధించి ఆయన బ్యాంకు ఖాతాను మోసపూరిత ఖాతాగా ఎస్బీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రొసీడింగ్స్ను నిలిపివేయాలంటూ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు.
నిన్న ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ఎస్బీఐ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ప్రతివాదులైన రిజర్వు బ్యాంకు, ఎస్బీఐలకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. ఎస్.బి.ఐ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను నిలపివేస్తూ నిర్ణయం ప్రకటించింది.