భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.సరిహద్దు ప్రాంతాల్లో Telangana ప్రజలు చిక్కుకుపోయే అవకాశాలు ఉన్నాయి. వారిని ఆదుకునేందుకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.ఇది యుద్ధ స్థితిని దృష్టిలో ఉంచుకున్న నిర్ణయమని చెబుతున్నారు.ఎవరైనా Telangana పౌరులు ఆపదలో ఉంటే భయపడకండి.మీరు వెంటనే కంట్రోల్ రూమ్కు కాల్ చేయవచ్చు. ముఖ్య నంబర్:011-23380556.ఈ నంబరుతో ఏదైనా సమాచారం పొందొచ్చు.

ప్రజలకి మరింత సులభంగా సేవలు అందించేందుకు మరిన్ని నంబర్లు ఇచ్చారు:
లైజన్ హెడ్ – 98719-99044
వ్యక్తిగత సహాయకుడు – 99713-87500
లైజన్ ఆఫీసర్ – 96437-23157
పీఆర్వో – 99493-51270
ఈ నంబర్ల ద్వారా ఏ సమయంలోనైనా అధికారులను సంప్రదించవచ్చు.సరిహద్దు ప్రాంతాల్లో Telangana వాళ్లు ఉంటే వారి భద్రత ముఖ్యమని ప్రభుత్వం చెబుతోంది.అవసరమైనప్పుడు సకాలంలో సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ కేంద్రం ఏర్పాటైంది.సరిహద్దు రాష్ట్రాల్లో ఉంటే, సమాచారం కోసం డౌట్లు ఉంటే, వెంటనే కంట్రోల్ రూమ్ను సంప్రదించండి.ఇది 24 గంటలు పనిచేస్తుంది. సకాలంలో సహాయం అందేలా అధికారులు పని చేస్తున్నారు.ప్రజల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.ఎలాంటి అత్యవసర పరిస్థితైనా తక్షణం స్పందించేందుకు సిద్ధంగా ఉంది.ఈ సమాచారం ప్రతి Telangana పౌరుడికి చేరాలి.
Read Also : Hyderabad: ఉద్యోగం ఇచ్చిన సంస్థకే ఎసరు ఇంతకీ ఎం చేసాడంటే?