Telangana government gives good news to Muslims

Ramadan Festival: ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Ramadan Festival: తెలంగాణ ప్రభుత్వం రంజాన్ పండుగ వేళ శుభవార్తను ప్రకటించింది. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ నేపథ్యంగా వరుసగా రెండు రోజులు సెలవులు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ పని దినాల ప్రకారం మార్చి 31వ తేదీన ఈదుల్ ఫితర్ (రంజాన్) పండుగను జరుపుకోనున్నారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు, ఆఫీస్‌లకు సెలవు ఉండనుండగా తర్వాత రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీన కూడా సెలవు ప్రకటించింది. గత ప్రభుత్వం అధికారంలోకి ఉన్న సమయంలో బోనాల పండుగ తర్వాతి రోజు, క్రిస్మస్ పండుగ తర్వాతి రోజు, రంజాన్ పండుగ తర్వాతి రోజు సెలవులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది.

Advertisements
ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ

ఆప్షనల్ హాలిడేను ప్రభుత్వం

ప్రస్తుత ప్రభుత్వం కూడా దానినే కొనసాగిస్తూ ముందుకు వెళ్తోంది. ఏపీలో మాత్రం మార్చి 31వ తేదీన ఒక్కరోజే సెలవు ఉండనుంది. ఇక రేపు (మార్చి 28) జమాతుల్-విదా సందర్భంగా ఆప్షనల్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించింది. మిగతా కాలేజీలు, స్కూళ్లు యథావిధిగా పని చేయనున్నాయి. రేపు ముస్లిం మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంతో పాటు ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ సెలవు ప్రభావం ఉంటుంది. వరుస పండగల నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో విద్యాసంస్థలు ఏప్రిల్ 2న బుధవారం తిరిగి ప్రారంభం కానున్నాయి.

మైనార్టీ విద్యా సంస్థలకు వరుస సెలవులు

రేపటి నుంచి ఒక్క శనివారం(మార్చి 29) మినహా బుధవారం మైనార్టీ విద్యా సంస్థలకు వరుస సెలవులు వచ్చాయి. మిగతా వారికి మార్చి 30 ఉగాదితోపాటు.. ఆదివారం కావడం, తర్వాతి రోజు రంజాన్, ఆ తర్వాతి రోజు ఏప్రిల్ 1న కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో.. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి విద్యార్థులకే కాదు.. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి కూడా అవకాశం ఏర్పడింది.

Related Posts
Hot Air Balloon: హాట్ ఎయిర్ బెలూన్ నుంచి కిందపడి వ్యక్తి మృతి
హాట్ ఎయిర్ బెలూన్ నుంచి కిందపడి వ్యక్తి మృతి

రాజస్థాన్ రాష్ట్రంలోని బారన్ జిల్లాలో హాట్ ఎయిర్ బెలూన్ ప్రయోగం ప్రమాదకరమైనదిగా మారింది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ జరుగుతున్న శోధన ప్రకారం, Read more

సీఎం సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.కోటి విరాళం అందజేత
Bank of Baroda presented donation cheque with CM Revanth Reddy

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటిని విరాళంగా అందించింది. ఈ సందర్భంగా గురువారం జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని బ్యాంక్ ఆఫ్ Read more

Betting app : బెట్టింగ్‌ యాప్‌లకు అడ్డుకట్ట.. త్వరలోనే ఓ పాలసీ : మంత్రి లోకేశ్‌
A policy to curb betting apps will be issued soon.. Minister Lokesh

Betting app: మంత్రి నారా లోకేశ్‌ బెట్టింగ్‌ యాప్‌ల స్పందించారు. ఈ మేరకు బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌లను అరికట్టాలంటూ యూట్యూబర్‌ అన్వేష్ చేసిన పోస్ట్‌కు లోకేశ్‌ స్పందించారు. Read more

కాంగ్రెస్‌కు ఏటీఎంగా తెలంగాణ మారింది – కేటీఆర్
ktr comments on congress government

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో, శివసేన నాయకుడు కిరణ్ పావాస్కర్ తెలంగాణ, కర్ణాటక సరిహద్దులను మూసేయాలనీ, భద్రతను కట్టుదిట్టం చేయాలనీ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×