Telangana Focused on Building Skilled Workforce by 2030 .EY Parthenon . CII Report

2030 నాటికి నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని నిర్మించడంపై దృష్టి సారించిన తెలంగాణ

హైదరాబాద్ : నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ యొక్క డిమాండ్‌లకు అనుగుణంగా తెలంగాణ తన విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడానికి పరివర్తనాత్మక చర్యలు తీసుకుంటోంది. ఇటీవల విడుదలైన ‘బ్రిడ్జింగ్ ది గ్యాప్..ఇంటిగ్రేటింగ్ స్కిల్లింగ్ ఇన్‌టు తెలంగాణస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రిపోర్ట్’ ను ఈవై-పార్థెనాన్ సహకారంతో సిఐఐ తెలంగాణ రూపొందించింది. రాష్ట్ర విద్యా రంగానికి సంబంధించిన సమగ్ర విశ్లేషణను ఇది అందిస్తుంది. మారుతున్న పోకడలు, సవాళ్లు మరియు అవకాశాలను ఇది వెల్లడించటంతో పాటుగా వృత్తి శిక్షణ మరియు పరిశ్రమ-సమలేఖన నైపుణ్యాలను పాఠ్యాంశాల్లోకి చేర్చవలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది.

Advertisements

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 2023-24లో US$ 187 బిలియన్లకు చేరుకుంటుందని మరియు 2030 నాటికి రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వృద్ధికి తోడ్పాటునందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తమ యువతను లైఫ్ సైన్సెస్, ఐటీ, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ మొబిలిటీ, డిఫెన్స్ వంటి అధిక వృద్ధి రంగాల్లో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడంపై దృష్టి సారిస్తోంది. ఈ నివేదిక గురించి ఈవై -పార్థెనన్ భాగస్వామి డాక్టర్ అవంతిక తోమర్ మాట్లాడుతూ, “సాంప్రదాయ విద్యా నమూనాలలో నైపుణ్య విద్య మరియు వృత్తి శిక్షణను మిళితం చేయటం భారతదేశంతో సహా దేశం యొక్క ఎదుగుదలకు మరియు పోటీతత్వానికి కీలకం. జాతీయ జిడిపి వృద్ధిని మించి తెలంగాణ అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. తెలంగాణకు ఉన్నత మరియు నైపుణ్య విద్యలో అనేక అవకాశాలు ఉన్నాయి” అని అన్నారు.

సిఐఐ తెలంగాణ చైర్మన్ శ్రీ సాయి ప్రసాద్ నొక్కిచెబుతూ “తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఉద్దేశించిన వ్యూహాత్మక విధాన సిఫార్సులకోసం సిఐఐ స్థిరంగా కృషి చేస్తోంది. మేము దృష్టి పెడుతున్న ముఖ్యాంశాలలో ఒకటి పరిశ్రమల ఇంటర్న్‌షిప్‌ల ఏకీకరణ, విద్యార్థులకు మాత్రమే కాకుండా, అధ్యాపకులకు కూడా ఇంటర్న్‌షిప్‌లను తప్పనిసరి చేయడం ద్వారా, అధ్యాపకులు పరిశ్రమ ధోరణులతో మరింత సన్నిహితంగా ఉండేలా చూస్తాము, తద్వారా, అకాడెమియా మరియు పరిశ్రమల మధ్య అంతరాన్ని భర్తీ చేయడం , ఆవిష్కరణలను నడిపించటం మరియు దీర్ఘకాలంలో ఉపాధిని పెంచటం దీనితో సాధ్యమవుతుంది” అని అన్నారు.

Related Posts
తగ్గిన బంగారం ధరలు..ఎంతంటే !!
రూ.89 వేలు దాటిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కొంత మేరకు తగ్గడం కొనుగోలుదారులకు ఊరట కలిగించింది. పసిడి ధరలు గత కొన్ని రోజులుగా అస్థిరంగా మారటంతో ప్రజలు ఆందోళన Read more

టెన్త్ హాల్ టికెట్లు విడుదల
Tenth Hall Ticket Released

హైదరాబాద్‌: పదోతరగతి విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పదోతరగతి పబ్లిక్ పరీక్ష, మార్చి 2025 హాల్ టిక్కెట్‌లు ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం 2:00 Read more

డిప్రెషన్‌తో కేపీ చౌదరి ఆత్మహత్య : పోలీసులు
KP Chowdary

తెలుగు సినీ నిర్మాత కెపి చౌదరి తన సూసైడ్ నోట్‌లో డిప్రెషన్ కారణంగానే తాను ఈ విపరీతమైన చర్య తీసుకున్నానని, తన మరణానికి ఎవరూ బాధ్యులు కాకూడదని Read more

ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఇదేనా?
longest traffic jam

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా భక్తులతో కిక్కిరిసిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. ఈ పెరిగిన రద్దీ Read more

×