Telangana became prosperous under KCR rule for ten years!

పదేండ్ల కేసీఆర్‌ పాలనలో సుభిక్షంగా మారిన తెలంగాణ !

వారి విమర్శలు ఉత్తవేనని ఈ లెక్కలు తేల్చియి

హైదరాబాద్: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన రాష్ట్ర గణాంక నివేదిక-2024(అట్లాస్‌) పదేండ్ల కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం సాధించిన అభివృద్ధికి అక్షరసాక్ష్యంగా నిలిచింది. వివిధ రంగాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పొందుపరుస్తూ రూపొందించిన ఈ నివేదిక బీఆర్‌ఎస్‌ హయాంలో సాధించిన రాష్ట్ర పురోగతికి అద్దం పట్టింది. కాంగ్రెస్‌ నేతల నోళ్లకు తాళం వేసింది. వారి విమర్శలు ఉత్తవేనని ఈ లెక్కలు తేల్చిచెప్పాయి. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ స్టేట్‌ స్టాటిస్టికల్‌ అబ్‌స్ట్రాక్ట్‌(అట్లాస్‌) పుస్తకాన్ని డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆవిషరించారు.

అన్ని రంగాల్లో అనితర సాధ్యమైన వృద్ధి

పదేండ్ల కేసీఆర్‌ పాలనలో తెలంగాణ సుభిక్షంగా మారింది. దశాబ్దాల వివక్షను, నిర్లక్ష్యాన్ని చెరిపేస్తూ అభివృద్ధి బాట పట్టింది. అన్ని రంగాల్లో అనితర సాధ్యమైన వృద్ధి సాధించింది. వ్యవసాయం పండుగలా మారింది. పొద్దున లేస్తే బీఆర్‌ఎస్‌ పాలనను రాజకీయంగా విమర్శించే కాంగ్రెస్‌ సర్కారే ఈ విషయాలను వెల్లడించింది. కేసీఆర్‌ అమలు చేసిన పథకాలు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని, సంక్షేమాన్ని పెంచిందని కాంగ్రెస్‌ సర్కారు ఈ నివేదికలో పేర్కొన్నది.

పదేండ్ల కేసీఆర్‌ పాలనలో సుభిక్షంగా

కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి గణనీయం

తెలంగాణ ఏర్పాటు తరువాత దేశ సగటుతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రం దేశీయ స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ)లో ప్రతిఏటా వృద్ధిని నమోదు చేసింది. 2023-24లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.15, 01,981కోట్లతో 14.5 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది. జీఎస్‌డీపీ వృద్ధిలో నాన్‌ స్పెషల్‌ క్యాటగిరీ రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్‌-1గా నిలిచినట్టు పేర్కొన్నది. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి గణనీయంగా జరిగిందని, దేశ సగటుతో పోల్చుకుంటే తెలంగాణ అధికంగా, వేగంగా వృద్ధిని నమోదు చేసినట్టు గణాంకాలు స్పష్టం చేశాయి. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ అగ్రభాగాన నిలిచినట్టు వెల్లడైంది.

గణాంక నివేదిక

2014-15లో రూ.5,05,849 కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్‌డీపీ2023-24లో 196.9 శాతం వృద్ధితో రూ. 15,01,981 కోట్లుగా నమోదైంది.అదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి మాత్రం 136.89 శాతంగానే ఉన్నది. 2023-24లో దేశ తలసరి ఆదాయం రూ.1,84,205 ఉండగా, తెలంగాణలో రూ. 3,56,564తో నాన్‌ స్పెషల్‌ క్యాటగిరీ(ఎన్‌ఎస్‌సీ) రాష్ర్టాల్లో అగ్రభాగాన నిలిచింది. 2014-15లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 68.17లక్షల టన్నులు ఉండగా, 2023-24లో 260.88 లక్షల టన్నులకు పెరిగింది. 2014-15లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు ఉండగా 2023-24లో ఏకంగా 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది.

Related Posts
london airport : లండన్‌లో భారీ అగ్ని ప్రమాదం – హీత్రూ విమానాశ్రయం మూసివేత
లండన్‌లో భారీ అగ్ని ప్రమాదం – హీత్రూ విమానాశ్రయం మూసివేత

లండన్‌లోని ఒక ప్రధాన విద్యుత్‌ సబ్-స్టేషన్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం వల్ల హీత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వేలాది నివాసాలకు విద్యుత్‌ సరఫరా Read more

ఎలోన్ మస్క్‌ని కలవనున్న ప్రధాని మోదీ
ఎలోన్ మస్క్ ని కలవనున్న ప్రధాని మోదీ

ఈ నెలలో అమెరికా పర్యటనకు వెళ్లనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్‌ను కూడా కలుసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి Read more

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ముబారక్‌ గుల్‌ ప్రమాణస్వీకారం
Mubarak Gul sworn in as Protem Speaker of Jammu and Kashmir Assembly

శ్రీనగర్‌: కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో సుదీర్ఘకాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ చివరగా బీజేపీ-పీడీపీ సంకీర్ణ సర్కారు కుప్పకూలడం, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ Read more

తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హైకోర్టు అనుమతి
High Court approves Group 1 Mains exams in Telangana

హైదరాబాద్‌: : తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు హైకోర్టు కొట్టివేసింది. ఈనెల 21వ తేదీ Read more