Telangana Assembly sessions continue for second day

రెండో రోజు కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌: నేడు రెండో రోజు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవా వర్మ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగుతుంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ తీర్మానాన్ని బలపరుస్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానం పై చర్చ శనివారం కూడా కొనసాగనుంది.

రెండో రోజు కొనసాగుతున్న తెలంగాణ

సభ ముందుకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ

అదే విధంగా బుధవారం రోజున బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ మంత్రి సభ ముందు తీసుకొచ్చారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క తెలంగాణ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ 5, 6, 7 వార్షిక నివేదికల ఖాతాల కాపీని సభలో పెట్టారు. అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ నోటిఫికేషన్ కాపీని మంత్రి సీతక్క సభ ముందు పెట్టారు.

19న అసెంబ్లీలో బడ్జెట్‌

కాగా, ఈనెల 27వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. హోలీ సందర్భంగా శుక్రవారం సభకు సెలవు ప్రకటించారు. ఈనెల 19న అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈనెల 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశముంది. 21వ తేదీ నుంచి బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుండగా.. ఈనెల 27 వరకు పలు పద్దులపై చర్చ కొనసాగుతాయి. అదేరోజు సభ వాయిదా పడే అవకాశం కూడా ఉంది. మొత్తంగా 12 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

Related Posts
రాజస్థాన్ విద్యుత్ శాఖతో సింగరేణి ఒప్పందం
Singareni agreement with Rajasthan Power Department

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ముందడుగు కారణంగా సింగరేణి వ్యాపార విస్తరణలో మరో కీలకమైన ఘట్టం ప్రారంభమవుతోంది. నేడు రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై Read more

USA: భారత నిఘా సంస్థ ‘రా’ పై ఆంక్షలు విధించిన అమెరికా ?
Has the US imposed sanctions on Indian intelligence agency 'RAW'?

USA: భారత్‌ కు చెందిన నిఘా సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇటీవల ది యూఎస్‌ కమిషన్‌ ఆన్‌ Read more

Marri Rajasekhar: వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరిక
Marri Rajasekhar: వైసీపీకి గుడ్‌బై - టీడీపీలో చేరనున్న మర్రి రాజశేఖర్!

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ వైపు అడుగులు Read more

బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఆర్ కృష్ణయ్య
r krishnaiah

త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికలకు గాను బీజేపీ ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను ఈ రోజు విడుదల చేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ రాజ్య Read more