ఆరో రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Telangana assembly meetings started on the sixth day

హైద‌రాబాద్ : ఆరో రోజు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈరోజు మ‌రో 19 ప‌ద్దుల‌పై చ‌ర్చ ప్రారంభ‌మైంది. నిన్న 19 ప‌ద్దుల‌పై చ‌ర్చ జ‌రిగింది. సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభ‌మైన స‌భ‌.. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున 3 గంట‌ల వ‌ర‌కు స‌భ కొన‌సాగింది. ఈ నేప‌థ్యంలో స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ స‌భ్యుల‌కు కీల‌క సందేశం ఇచ్చారు. నిన్న‌టిలాగా సుదీర్ఘ ప్ర‌సంగాలు చేయొద్ద‌ని స‌భ్యుల‌కు స్పీక‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌తి స‌భ్యుడికి 15 నిమిషాల స‌మ‌యం కేటాయిస్తామ‌న్నారు. స‌భ్యులంద‌రూ స‌బ్జెక్ట్‌పైనే మాట్లాడాల‌ని స‌భాప‌తి స‌భ్యుల‌కు సూచించారు. ఈరోజు వ్య‌వ‌సాయం, స‌హ‌కార‌, నీటిపారుద‌ల‌, ఆర్ అండ్ బీ, పంచాయ‌తీరాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్లు, గృహ నిర్మాణం, పౌర స‌ర‌ఫ‌రాలు, ప‌శు సంవ‌ర్ధ‌క‌, ప‌ర్యాట‌క‌, క్రీడా శాఖ‌, అట‌వీ, దేవాదాయ‌, మైనార్టీ, చేనేత‌, స్త్రీ శిశు సంక్షేమ ప‌ద్దుల‌పై చ‌ర్చ ప్రారంభ‌మైంది.

కాగా, ఈరోజు సభ ముందుకు స్కిల్‌ యూనివర్శిటీ బిల్లు రానుంది. మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. నేడు అసెంబ్లీ వేదికగా రూ.లక్షన్నర రుణాల వరకు మాఫీ ప్రకటన చేయనున్నారు.