pavan and lokesh

నారాలోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లపై టీడీపీ ఎమ్మెల్యే ఆసక్తిక వ్యాఖ్యలు

చలికాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడికి పుట్టిస్తున్నాయి. మంత్రి నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కూటమిలో రాజకీయం వేడెక్కింది. అయితే రాజమహేంద్రవరం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాదు ముఖ్యమంత్రి కూడా కావాలి అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా స్వాగతిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కూటమిలో పెద్దలు ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో నిర్ణయిస్తారన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్. పార్టీ నేతలు ఏం చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనని.. అలాగే లోకేష్‌ డిప్యూటీ సీఎం కావాలని.. సీఎం చంద్రబాబు చెబితేనే ప్రాధాన్యం ఉంటుందన్నారు.

అయితే డిప్యూటీ సీఎం, సీఎం పదవులు అంటూ టార్గెట్‌గా చేసుకుని వైఎస్సార్‌సీపీ సైకోలు కూటమిలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదిరెడ్డి శ్రీనివాస్.
మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ ఆసక్తికరంగా స్పందించారు. జనసేన పార్టీ నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని.. సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని వ్యాఖ్యానించారు. మంత్రి లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు కోరుకోవడంలో తప్పు లేదని.. తాము కూడా పవన్ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Related Posts
23న ఏపీ క్యాబినెట్ భేటీ
ap cabinet meeting

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం ఈ నెల 23న మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు Read more

పులివెందులలో జగన్ ప్రజాదర్బార్
ys jagan

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు. నాలుగు రోజుల జిల్లా టూర్ లో ఉన్న వైఎస్ Read more

జగన్‌కు పాస్‌పోర్టు పునరుద్దరణకు హైకోర్టు ఆదేశాలు
AP High Court orders to restore YS Jagan passport

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఐదేళ్ల కాలపరిమితతో పాస్‌పోర్టు జారీ చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. Read more

ప్రశాంత్ కిశోర్‌తో మంత్రి లోకేశ్ భేటీ..!
Minister Lokesh meet with Prashant Kishor.

న్యూఢిల్లీ: మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్లారు. లోకేష్ కేంద్ర మంత్రిని కలవడానికి ముందుగానే లోకేష్ ను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *