Andhrapradesh: తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం తీసుకున్న తాజా కీలక నిర్ణయం

Talliki Vandhanam: తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం తీసుకున్న తాజా కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తూ కీలకమైన రెండు పథకాలపై కార్యాచరణను వేగవంతం చేసింది. ముఖ్యంగా రైతులకు “అన్నదాత సుఖీభవ” పథకం మొదటి విడత నిధులు విడుదలకు సిద్ధమవుతుండగా, విద్యార్థుల తల్లులకు ఇచ్చే “తల్లికి వందనం” పథకం అమలు పై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ రెండు పథకాలూ సీఎం చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ప్రధానంగా హామీ ఇచ్చినవే కావడం గమనార్హం. కాగా, ఇకే విడతలోనే అమలు చేస్తారా రెండు విడతలుగా చెల్లిస్తారా అనేది చర్చగా మారింది.

Advertisements

తల్లికి వందనం

తల్లికి వందనం పథకం ముఖ్య ఉద్దేశ్యం, విద్యకు ప్రోత్సాహం కల్పిస్తూ తల్లుల భాగస్వామ్యాన్ని గుర్తించడం. ప్రతి అర్హత గల విద్యార్థి తల్లికి ఏడాదికి ₹15,000 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయడం ఈ పథకం లక్ష్యం. ఈ విధంగా విద్యార్ధుల చదువులో తల్లుల భాగస్వామ్యం పెరిగి హాజరు, చదువు ఉత్సాహం, మరియు డ్రాప్‌ అవుట్ రేట్లు తగ్గే అవకాశం ఉంది.

విడతలలో చెల్లింపు పై చర్చ

ఈ పథకానికి సంబంధించి ఒకే విడతగా ₹15,000 చెల్లించాలా? లేక రెండు విడతలుగా ₹7,500 చొప్పున చెల్లించాలా అన్నది ప్రస్తుతం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చకు కారణం – అదే నెలలో “అన్నదాత సుఖీభవ” నిధులు విడుదల చేయాల్సిన పరిస్థితి. నిధుల మేనేజ్‌మెంట్ కోణంలో ఇది ప్రభుత్వానికి కీలకమైన నిర్ణయంగా మారింది. కాగా, తాజాగా చంద్రబాబు కూటమి నేతలతో టెలి కాన్ఫిరెన్స్ లో తల్లికి వందనం పాఠశాలల ప్రారంభానికి ముందే అమలు చేస్తామని స్పష్టత ఇచ్చారు. 2025- 26 బడ్జెట్‌లో రూ. 9407 కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేసారు. 2024-25 విద్యా సంవత్స రంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాధమికం గా 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం.

అమలులో నిబంధనలు

ఈ పథకం అమలులో విద్యార్థి హాజరు 75 శాతం పైగా ఉండాలి అనే నిబంధన కొనసాగించబోతున్నారు. గతంలో వైసీపీ ప్రభు త్వం నిర్దేశించిన మార్గదర్శకాల ను సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపు దారులు.. తెల్ల రేషన్‌ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్‌ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు. ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక, కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం తల్లికి వందనం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు తుది రూపుదిద్దుకుంటున్నాయి. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతకు పెద్ద పీట వేయనున్నారు. ఎలాంటి రాజకీయం లేకుండా అర్హులందరికీ సకాలంలో నిధులు జమ చేసేందుకు డిజిటల్ డేటాబేస్ ఆధారంగా వ్యవస్థను నిర్మిస్తున్నారు.

Read also: DSC : మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

Related Posts
అమెరిక‌న్ మ‌ద్యంపై భార‌త్ 150 శాతం సుంకం: వైట్‌హౌజ్
India imposes 150 percent tariff on American liquor: White House

న్యూయార్క్ : భారత్‌పై శ్వేత సౌధం కీల‌క ఆరోప‌ణ చేసింది. అమెరికా మ‌ద్యం, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌పై భార‌త్ అధిక స్థాయిలో సుంకాలు వ‌సూల్ చేస్తున్న‌ట్లు చెప్పింది. అమెరిక‌న్ Read more

కార్యకర్త తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపైనా, పార్టీపైనా పడుతుంది: సీఎం చంద్రబాబు
CM Chandrababu held meeting with TDP Representatives

మంగళగిరి: టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో Read more

వంశీ అరెస్ట్ తో వెలుగులోకి కీలక అంశాలు
వల్లభనేనివంశీ అక్రమార్జన రూ.195 కోట్లు

వైసీపీ నేత మరియు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వివాదం తాజాగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో పనిచేస్తున్న సత్యవర్ధన్‌ను బెదిరించి, తప్పుడు Read more

ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు ఉగ్ర బెదిరింపులు..
'Terror threat' to PM Modi's aircraft, Mumbai Police receives warning call, probe on

ముంబయి : ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు నేపథ్యంలో ఉగ్ర బెదిరింపు కాల్ వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబయి పోలీస్‌ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×