Swachh Andhra Swachh Diva

మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ ప్రారంభం

కడప జిల్లా మైదుకూరులో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మైదుకూరులో కొత్త చరిత్రకు నాంది పలుకుతూ, ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు.

సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి పూర్తిస్థాయి మద్దతు ఇస్తామని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు ఎలా ఉంటాయో గతంలో తాను చూశానని, మహిళలు వంటచేయడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని ఆయన గుర్తు చేశారు. దీపం కార్యక్రమం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, ఇప్పుడు దీపం-2 కింద మరింత సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు.

చెత్త కలెక్షన్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని సీఎం వెల్లడించారు. పొడి, తడి చెత్తను వేరు చేయడం ద్వారా ఆ చెత్తను ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. చెత్త నుండి బయోగ్యాస్, విద్యుత్తు వంటి ఉపయోగకరమైన వస్తువులను తయారుచేసే విధానాలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు. స్వచ్ఛతలో మైండ్ కంట్రోల్ ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మంచిపరిణామాలకు దారితీస్తుందన్నారు. ప్రతి వ్యక్తి స్వచ్ఛతపై శ్రద్ధ చూపితేనే సమాజం మార్పు చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రతి ప్రభుత్వ కార్యాలయం, ప్రతి పాఠశాలలో స్వచ్ఛత పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛతకు అంకితం చేయాలని సూచించారు.

Related Posts
ఫిబ్రవరి 19న ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం !
Delhi new CM will take oath on February 19!

సీఎం రేసులో పర్వేశ్‌ వర్మ ముందంజ..! న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 70 అసెంబ్లీ స్థానాలకు గానూ Read more

‘ది టీచర్ యాప్’ను ఆవిష్కరిస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Union Education Minister Dharmendra Pradhan unveiling The Teacher App

వివిధ రకాల ఉపాధ్యాయ అభ్యసన స్టైల్స్ కు మద్దతు ఇవ్వడానికి ది టీచర్ యాప్ ఉచిత, మంచి-క్వాలిటీ కలిగిన, ఇంటరాక్టివ్ డిజిటల్ వనరులను అందిస్తుంది. సృజనాత్మక మరియు Read more

భారతదేశంలో అత్యంత యువ పైలెట్‌గా సమైరా హుల్లూర్..
samaira hullur

18 ఏళ్ల సమైరా హుల్లూర్, కర్ణాటక రాష్ట్రం నుండి భారతదేశంలో అత్యంత యువ వాణిజ్య పైలెట్‌గా గుర్తింపు పొందింది. ఆమె 18 ఏళ్ల వయస్సులోనే కమర్షియల్ పైలట్ Read more

కొనసాగుతున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్..
Counting of Maharashtra and Jharkhand elections continues

ముంబయి: మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ఈరోజు (శనివారం) ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లోనూ హోరాహోరీ పోరు జరగడం, ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ గెలుపెవరిదో నిర్దిష్టంగా తేలకపోవడంతో కౌంటింగ్‌పై Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *